
Tej pratap: ‘మాలో చీలిక తెచ్చేందుకు కుట్ర’.. మౌనం వీడిన తేజ్ప్రతాప్
Play all audios:

పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఇటీవల ప్రకటించారు. ఇంటర్నెట్ డెస్క్: బిహార్లో అసెంబ్లీ
ఎన్నికలు సమీపిస్తున్న వేళ రాష్ట్రీయ జనతాదళ్ (RJD)లో ఇటీవల కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పార్టీ నుంచి తన పెద్ద కుమారుడు, మాజీ మంత్రి తేజ్ ప్రతాప్ యాదవ్ను బహిష్కరిస్తున్నట్లు ఆ పార్టీ
అధినేత లాలూ ప్రసాద్ (Lalu Prasad Yadav) ప్రకటించిన సంగతి తెలిసిదే. వీటిపై తేజ్ ప్రతాప్ మౌనం వీడారు. తనకు, తన తమ్ముడు తేజస్వీ యాదవ్ల మధ్య చిచ్చు పెట్టేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు.
‘‘మా మధ్య చీలిక వస్తుందని కలలు కంటున్న వారు ఎన్ని కుట్రలు చేసినా విజయం సాధించలేరు. వాటన్నింటినీ త్వరలోనే బయటపెడుతా. అన్నివేళలా తోడుగా ఉంటాననే భరోసాను నీకు (తేజస్వీని ఉద్దేశిస్తూ) ఇస్తున్నా.
అమ్మా, నాన్నలను జాగ్రత్తగా చూసుకో. జైచంద్ లాంటి వాళ్లు ఇంట్లో, బయట ఉన్నారు’’ అని తేజ్ ప్రతాప్ పేర్కొన్నారు. అంతకుముందు లాలూ, రబ్రీదేవీలను ఉద్దేశిస్తూ ఎక్స్లో స్పందించిన తేజ్ ప్రతాప్..
జైచంద్ వంటి వారు తనపై కుట్రలు చేశారని ఆరోపించారు. తల్లిదండ్రుల ప్రేమ, విశ్వాసం మాత్రమే తనకు కావాలని, మరేదీ వద్దని చెప్పారు. * ఎవరీ శర్మిష్ఠ పనోలీ.. పోలీసులు ఎందుకు అరెస్టు చేశారు? తాను
రిలేషన్షిప్లో ఉన్నానంటూ తేజ్ ప్రతాప్ ఫేస్బుక్లో పెట్టిన ఓ పోస్టు సామాజిక మాధ్యమాల్లో ఇటీవల వైరల్గా మారింది. అనుష్క అనే మహిళతో గత 12 ఏళ్లుగా రిలేషన్లో ఉంటున్నాన్నది దాని సారాంశం. ఈ
విషయాన్ని తీవ్రంగా పరిగణించిన ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్.. పార్టీ నుంచి ఆరేళ్ల పాటు బహిష్కరించడంతోపాటు తమ కుటుంబంలోనూ తేజ్ ప్రతాప్కు స్థానం లేదని ప్రకటించారు.