Ipl 2025: ఐపీఎల్‌ జట్లకు ఊరట.. నిర్ణయం మార్చుకున్న దక్షిణాఫ్రికా

Ipl 2025: ఐపీఎల్‌ జట్లకు ఊరట.. నిర్ణయం మార్చుకున్న దక్షిణాఫ్రికా

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌, పాకిస్థాన్‌ సరిహద్దుల్లో ఉద్రిక్తత కారణంగా ఐపీఎల్‌ (IPL) వారం పాటు వాయిదా పడిన విషయం తెలిసిందే. మ్యాచ్‌లు తిరిగి మే 17 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో


ఐపీఎల్‌ ఫ్రాంఛైజీలకు దక్షిణాఫ్రికా ఓ శుభవార్త చెప్పి ఊరట కల్పించింది. మొదట దక్షిణాఫ్రికా క్రికెట్‌ బోర్డు తమ ఆటగాళ్లు ముందు చేసుకున్న ఒప్పందం ప్రకారం ఐపీఎల్‌కు మే 26 వరకు మాత్రమే అందుబాటులో


ఉంటారని ప్రకటించింది. జూన్‌లో తాము ఆస్ట్రేలియాతో డబ్ల్యూటీసీ (ICC World Test Championship) ఫైనల్‌ ఆడాల్సి ఉన్న నేపథ్యంలో తమ ప్రథమ ప్రాధాన్యం ఐపీఎల్‌ కాదని చెప్పింది. కానీ అంతలోనే యూటర్న్‌


తీసుకొని తమ నిర్ణయాన్ని వెనక్కి తీసుకుంది.  ఈనేపథ్యంలో దక్షిణాఫ్రికా ఆటగాళ్లు ఐపీఎల్‌కు అందుబాటులో ఉండనున్నారు. డబ్ల్యూటీసీ ఫైనల్‌ కోసం సౌతాఫ్రికా తన సన్నాహక సమయాన్ని తగ్గించుకుంది.


షెడ్యూల్‌ ప్రకారం దక్షిణాఫ్రికా, జింబాబ్వేతో జూన్‌ 3న వార్మప్‌ మ్యాచ్‌ ఆడాల్సిఉంది. కానీ తాజాగా తీసుకున్న నిర్ణయంతో ఈ మ్యాచ్‌ రద్దయ్యే అవకాశం ఉంది. ‘మా షెడ్యూల్‌లో ఓ సవరణ చోటుచేసుకుంది.


జూన్‌ 3 నుంచి మేం డబ్ల్యూటీసీ ఫైనల్‌ మ్యాచ్‌ కోసం మా సన్నాహకాలను ప్రారంభించబోతున్నాం’ అని క్రికెట్ సౌతాఫ్రికా (CSA) డైరెక్టర్ ఆఫ్ క్రికెట్ ఎనోచ్ న్క్వే మీడియాతో తెలిపారు. ఈ కారణంగా.. కగిసో


రబాడ (గుజరాత్‌ టైటాన్స్‌), లుంగి ఎంగిడి (రాయల్‌ ఛాలెంజర్స్‌ బెంగళూరు), ట్రిస్టన్‌ స్టబ్స్‌ (దిల్లీ క్యాపిటల్స్‌), ఐదెన్‌ మార్‌క్రమ్‌ (లఖ్‌నవూ సూపర్‌ జెయింట్స్‌), ర్యాన్‌ రికెల్టన్‌,


కార్బిన్‌ బాష్‌ (ముంబయి ఇండియన్స్‌), మార్కో ఎన్సన్‌ (పంజాబ్‌ కింగ్స్‌), వియాన్‌ ముల్డర్‌ (సన్‌రైజర్స్‌ హైదరాబాద్‌) తమ తమ ఐపీఎల్‌ జట్లకు మ్యాచ్‌లు పూర్తయ్యేంతవరకు అందుబాటులో ఉండనున్నారు.