
ఈనాడు జర్నలిజం స్కూలు.. ప్రవేశపరీక్ష హాల్టికెట్ డౌన్లోడ్ చేశారా?
Play all audios:

Eenadu Journalism School Notification: ఈనాడు జర్నలిజం స్కూలు పరీక్షల వివరాలు మీ కోసం. By Features Desk Updated : 30 Apr 2025 13:40 IST Ee Font size * ABC MEDIUM * ABC LARGE * ABC EXTRA
LARGE 2 min read _ఈనాడు జర్నలిజం స్కూలు మల్టీ మీడియా, టెలివిజన్, మొబైల్ జర్నలిజం విభాగాల్లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తు చేశారా? పరీక్ష నమూనా పత్రాలు,
మోడల్ ఓఎంఆర్ షీట్, దరఖాస్తు డౌన్లోడ్ తదితర వివరాలు మీ కోసం..._ ------------------------- ఎంపిక: మొదట వివిధ అంశాల మీద రాత పరీక్షలు జరుగుతాయి. తెలుగు, ఇంగ్లిషు భాషల్లో ప్రావీణ్యాన్నీ,
అనువాద సామర్థ్యాన్నీ, వర్తమాన వ్యవహారాల్లో పరిజ్ఞానాన్నీ పరీక్షించే లఘు, వ్యాసరూప ప్రశ్నలు ఉంటాయి. తెలుగు రాష్ట్రాల్లోని అన్ని ఈనాడు ప్రచురణ కేంద్రాల్లోనూ ఈ పరీక్షలు జరుగుతాయి. వీటిలో
ఉత్తీర్ణులైన వారికి బృందచర్చలు, ఇంటర్వ్యూలు ఉంటాయి. సంస్థ నియమ నిబంధనలకు లోబడి తుది ఎంపిక ఉంటుంది. ------------------------- శిక్షణ, భృతి: ఈనాడు జర్నలిజం స్కూలులో ఏడాది శిక్షణ ఉంటుంది. ఈ
సమయంలో మొదటి ఆరు నెలలు Rs 14,000, తరువాతి ఆరు నెలలు Rs 15,000 చొప్పున నెలవారీ భృతి లభిస్తుంది. ------------------------- ఉద్యోగంలో: స్కూల్లో కోర్సును విజయవంతంగా పూర్తి చేసిన అభ్యర్థులకు
ట్రెయినీలుగా అవకాశం లభిస్తుంది. ఏడాది పాటు జరిగే ఈ శిక్షణలో Rs 20,000 జీతం ఉంటుంది. అది పూర్తయ్యాక, శిక్షణార్థుల వ్యక్తిగత ప్రతిభ ఆధారంగా ఒక ఏడాది ప్రొబేషన్లో Rs 22,000 వరకూ, ఆ తరువాత
కన్ఫర్మేషన్లో Rs 24,000 వరకూ జీతభత్యాలు ఉంటాయి. ------------------------- ఒప్పంద పత్రం: స్కూల్లో చేరిన అభ్యర్థులు ఏడాది తదనంతర శిక్షణతో కలిపి రామోజీ గ్రూపు సంస్థల్లో 3 సంవత్సరాలు విధిగా
పనిచేయాలి. ఈ మేరకు కోర్సు ప్రారంభంలోనే ఒప్పంద పత్రాన్ని సమర్పించాలి. ------------------------- ముఖ్య తేదీలు * ప్రవేశ పరీక్ష : 11.05.2025 * కోర్సు ప్రారంభం : 30.06.2025 Published : 23 Mar
2025 06:27 IST గమనిక: _ఈనాడు.నెట్లో కనిపించే వ్యాపార ప్రకటనలు వివిధ దేశాల్లోని వ్యాపారస్తులు, సంస్థల నుంచి వస్తాయి. కొన్ని ప్రకటనలు పాఠకుల అభిరుచిననుసరించి కృత్రిమ మేధస్సుతో పంపబడతాయి.
పాఠకులు తగిన జాగ్రత్త వహించి, ఉత్పత్తులు లేదా సేవల గురించి సముచిత విచారణ చేసి కొనుగోలు చేయాలి. ఆయా ఉత్పత్తులు / సేవల నాణ్యత లేదా లోపాలకు ఈనాడు యాజమాన్యం బాధ్యత వహించదు. ఈ విషయంలో ఉత్తర
ప్రత్యుత్తరాలకి తావు లేదు._