Ysrcp: వైకాపాకు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా

Ysrcp: వైకాపాకు మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ రాజీనామా

Play all audios:


వైకాపాకు (YSRCP) మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. అమరావతి: వైకాపాకు (YSRCP) మరో ఎమ్మెల్సీ రాజీనామా చేశారు. ఏపీ శాసన


మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్‌ జకియా ఖానం పార్టీకి రాజీనామా చేశారు. ఎమ్మెల్సీ పదవికి కూడా రాజీనామా చేస్తూ మండలి ఛైర్మన్‌కు లేఖ రాశారు. వ్యక్తిగత సిబ్బంది ద్వారా ఆమె ఈ లేఖను పంపారు. జకియా ఖానంను


2020 జులైలో ఎమ్మెల్సీగా గవర్నర్‌ నామినేట్‌ చేశారు. (Andhra Pradesh News) జకియా ఖానంది అన్నమయ్య జిల్లా రాయచోటి. రెండేళ్ల నుంచి ఆమె వైకాపాలో అసంతృప్తిగా ఉన్నారు. ఆమెతో కలిపి ఇప్పటివరకు


వైకాపాకు ఆరుగురు ఎమ్మెల్సీలు రాజీనామా చేశారు. కర్రి పద్మశ్రీ, పోతుల సునీత, జయమంగళ వెంకటరమణ, బల్లి కల్యాణ్ చక్రవర్తి, మర్రి రాజశేఖర్‌ రాజీనామా చేశారు.  భాజపా కార్యాలయానికి జకియా ఖానం జకియా


ఖానం విజయవాడలోని భాజపా కార్యాలయానికి వచ్చారు. వైకాపాకు రాజీనామా చేసిన అనంతరం భాజపా ఏపీ రాష్ట్ర అధ్యక్షురాలు పురందేశ్వరితో ఆమె భేటీ అయ్యారు.