Murali naik: అమర వీరుడు మురళీనాయక్‌కు నివాళులర్పించిన మంత్రులు లోకేశ్‌, అనగాని

Murali naik: అమర వీరుడు మురళీనాయక్‌కు నివాళులర్పించిన మంత్రులు లోకేశ్‌, అనగాని

Play all audios:


దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు మంత్రులు నారా లోకేశ్‌, అనగాని సత్యప్రసాద్‌, అనిత నివాళులర్పించారు గోరంట్ల: దేశ సరిహద్దుల్లో వీరమరణం పొందిన జవాను మురళీనాయక్‌కు మంత్రులు


నారా లోకేశ్‌, వంగలపూడి అనిత, అనగాని సత్యప్రసాద్‌, సవిత, సత్యకుమార్‌ నివాళులర్పించారు. శ్రీసత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కళ్లితండాకు వెళ్లి జవాను భౌతికకాయం వద్ద అంజలి ఘటించారు. మురళీనాయక్‌


తల్లిదండ్రులను లోకేశ్‌ ఓదార్చారు. జవాను పార్థివదేహం వద్ద నివాళులర్పించిన అనంతరం ఆయన సెల్యూట్‌ చేశారు. కుటుంబానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని లోకేశ్‌ భరోసా ఇచ్చారు. వీరితో పాటు


ఎంపీ పార్థసారథి, ఎమ్మెల్యేలు కాల్వ శ్రీనివాసులు, కందికుంట ప్రసాద్‌, మాజీ మంత్రి రఘువీరారెడ్డి తదితరులు జవాను భౌతికకాయం వద్ద నివాళులర్పించారు.