
Cm chandrababu: ఆగస్టు 15 నుంచి మహిళలకు బస్సుల్లో ఉచిత ప్రయాణం: సీఎం చంద్రబాబు
Play all audios:

కర్నూలు: రాష్ట్రంలోని మహిళలందరికీ స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ఆగస్టు 15 నుంచి ఉచిత బస్సు ప్రయాణ సదుపాయం కల్పిస్తామని సీఎం చంద్రబాబు (Chandrababu) తెలిపారు. కర్నూలులో ఏర్పాటు చేసిన
స్వర్ణాంధ్ర-స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో పాల్గొన్న సీఎం.. ఇల్లు, పరిసరాలను శుభ్రంగా ఉంచుతామని ప్రజలతో ప్రమాణం చేయించారు. రాష్ట్రంలో పచ్చదనం పెంచాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ప్రతి నెలా మూడో
శనివారం ఇళ్లు, పరిసరాల్లోని శుభ్రతపై దృష్టి పెట్టాలని సూచించారు. ఉద్యోగులు కూడా ప్రతినెలా మూడో శనివారం శుభ్రతపై దృష్టి పెట్టాలన్నారు. అన్ని నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేస్తాం ‘
‘రైతుబజార్లను 1999లో నేనే ఏర్పాటు చేశాను. రైతులకు గిట్టుబాటుధర రావాలి.. వినియోగదారులకు తక్కువ ధరకే నాణ్యమైన ఉత్పత్తులు అందజేయాలనే ఒక మంచి ఉద్దేశంతో ఏర్పాటు చేశాం. మేం తెచ్చిన రైతు బజార్ల
వల్ల రైతులు లబ్ధి పొందారు, వినియోగదారులకు కూడా ఎంతో మేలు జరిగింది. కర్నూలు సి క్యాంప్ రైతు బజారును రూ.6 కోట్లతో ఆదర్శ రైతుబజారుగా అభివృద్ధి చేస్తాం. పక్కనే ఉన్న స్థలంలో అండర్ గ్రౌండ్
పార్కింగ్ సదుపాయం కల్పిస్తాం. రాష్ట్రంలో ఇప్పటి వరకు 125 రైతు బజారులు ఉన్నాయి. రాష్ట్రంలోని 175 అసెంబ్లీ నియోజకవర్గాల్లో రైతు బజార్లు ఏర్పాటు చేసే బాధ్యత కూటమి ప్రభుత్వం తీసుకుంటుంది. రైతు
బజార్లకు సేంద్రియసాగులో పండించిన కూరగాయలు వచ్చేలా చూస్తాం. ప్రపంచం గర్వించేలా యోగా డే నిర్వహిస్తాం.. ప్రపంచం గర్వించేలా విశాఖలో యోగా డే నిర్వహిస్తాం.. ప్రధాని మోదీ కూడా వస్తున్నారు. యోగా
డేను నెలరోజులపాటు నిర్వహిస్తాం. ప్రజలకు శిక్షణ ఇస్తాం. ప్రతి ఒక్కరూ రోజుకు అరగంట యోగా చేయాలని కోరుతున్నా. ఆఫ్లైన్, ఆన్లైన్లో యోగా శిక్షణ ఇస్తాం. నెట్ జీరో వేస్ట్ కోసం ప్రజలంతా
ఆలోచించాలి. ప్రపంచంలో ఏ వస్తువూ వృథా కాదు.. అన్నీ ఏదో ఒక రూపంలో ఉపయోగపడతాయి. తడిచెత్త, పొడి చెత్తను వేరు చేయాలి. అక్టోబరు 2 నాటికి రాష్ట్రంలో ఎక్కడా చెత్త లేకుండా చూడాలని ఆదేశించా. చెత్త
నుంచి విద్యుదుత్పత్తి చేస్తున్నాం.. రెండు ప్రాజెక్టులు పనిచేస్తున్నాయి. రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, కడపలోనూ ప్రాజెక్టులు ఏర్పాటు చేస్తున్నాం. డ్వాక్రా, మెప్మా మహిళలు
పారిశ్రామికవేత్తలుగా మారుతున్నారు. గ్రామాల్లో చెత్తను ఎరువుగా మార్చే కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నాం. చెత్తను వేరు చేసి రీసైక్లింగ్కు పంపిస్తే.. వాటిని మళ్లీ వాడతారు. జపాన్లో ఎక్కడా రోడ్ల
మీద కాగితం కనిపించదు.. అదీ సామాజిక బాధ్యత. ఆ దేశంలో రోడ్డుపై పేపర్ కనిపిస్తే ఇంటికి తీసుకెళ్లి చెత్తబుట్టలో వేస్తారు. మన రాష్ట్రంలో కూడా ప్రజల్లో చైతన్యం రావాలి’’ అని చంద్రబాబు అన్నారు.
రాష్ట్ర మంత్రులు నారాయణ, ఎన్ఎండీ ఫరూఖ్, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, జిల్లా కలెక్టర్ తదితరులు కార్యక్రమంలో పాల్గొన్నారు.