
Nadendla manohar: రేషన్ కార్డులో పేరున్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలి: నాదెండ్ల మనోహర్
Play all audios:

రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జారీ చేయనున్న రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగానే ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. తెనాలి: రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా జారీ
చేయనున్న రేషన్ కార్డులు స్మార్ట్ కార్డు రూపంలో ఉచితంగానే ఇస్తామని ఏపీ పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రస్తుతం రేషన్
కార్డులు ఉన్న వారికి కూడా స్మార్ట్ కార్డులు అందజేస్తామని చెప్పారు. కార్డులో పేరు ఉన్న ప్రతి ఒక్కరూ ఈకేవైసీ చేయించుకోవాలని సూచించారు. ఈ నెల 15 నుంచి వాట్సప్ గవర్నెన్స్ ద్వారా పౌరసరఫరాలశాఖ
సేవలు అందుతాయని వెల్లడించారు. ‘‘ సంవత్సరంలోపు పిల్లలకు, 80 ఏళ్లు దాటిన వృద్ధులకు ఈకేవైసీ నుంచి మినహాయింపు ఉంటుంది. 95శాతం కేవైసీ పూర్తి చేసి.. దేశంలోనే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అగ్రస్థానంలో
నిలిచింది. గ్రామ, వార్డు సచివాలయాలకు వెళ్తే.. పాత రేషన్ కార్డు స్థానంలో కొత్త కార్డు అందిస్తారు. ఇప్పటి వరకు 72,500 మంది స్మార్ట్ కార్డులు పొందారు. పెళ్లి కాకుండా 50 ఏళ్లుదాటి, ఒంటరిగా
ఉన్నవాళ్లకు కార్డులు ఇస్తాం. లింగమార్పిడి చేయించుకున్నవాళ్లకు కూడా మొట్టమొదటి సారిగా రేషన్ కార్డులు అందజేస్తున్నాం’’ అని నాదెండ్ల మనోహర్ తెలిపారు.