Tirumala: తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

Tirumala: తిరుమల కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం

Play all audios:


తిరుమల: తిరుమల (Tirumala) కల్తీ నెయ్యి కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. తితిదే మాజీ ఛైర్మన్‌ వైవీ సుబ్బారెడ్డి పీఏ అప్పన్నకు సిట్‌ నోటీసులు ఇచ్చింది. రెండు రోజులుగా ఆయన్ను అధికారులు


ప్రశ్నిస్తున్నారు. అప్పన్నతో పాటు మరో ఆరుగురు తితిదే ఉద్యోగులను సిట్‌ విచారిస్తోంది. తిరుమల లడ్డూల తయారీలో కల్తీ నెయ్యి వాడిన కేసులో ఇప్పటికే 15 మందిని అరెస్టు చేశారు. అరెస్టైన వారిలో


తితిదేకు నెయ్యి సరఫరా చేసిన డెయిరీ యజమానులు, ఉద్యోగులు ఉన్నారు. (Andhra Pradesh News)