
Pawan kalyan: చెట్లు తొలగించడం కాదు.. మొక్క నాటడం నేర్చుకోవాలి: డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్
Play all audios:

విజయవాడ: ప్రజలు ప్రకృతితో మమేకం కావాలని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ (Pawan Kalyan) అన్నారు. విజయవాడ తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జీవ వైవిధ్య వేడుకల్లో ఆయన పాల్గొని మాట్లాడారు.
చెట్లు తొలగించడం కాదని.. మొక్క నాటడం నేర్చుకోవాలని చెప్పారు. ప్రకృతి నుంచి తీసుకోవడమే కాదు.. ఇవ్వడానికి అలవాటు పడాలన్నారు. సహజంగా పెరిగిన మొక్కలు మనకు అవసరం కాకపోవచ్చని.. కానీ ఇవి
జీవవైవిధ్యానికి తోడ్పడతాయని వివరించారు. మన పెరట్లో ఏం చేయగలం.. జీవ వైవిధ్యానికి ఎలా తోడ్పడగలమో ఆలోచించాలని సూచించారు. (Andhra Pradesh News)