
Rammohan naidu: సంక్షోభాలను ఎదురొడ్డి విజయవంతంగా సాగిన తెదేపా: రామ్మోహన్నాయుడు
Play all audios:

విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, పోలవరం, అమరావతి ఏడాదిలోపే సాధ్యం చేసి చూపామని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. కడప: విశాఖ స్టీల్ ప్లాంట్, రైల్వే జోన్, పోలవరం, అమరావతి
ఏడాదిలోపే సాధ్యం చేసి చూపామని కేంద్రమంత్రి రామ్మోహన్నాయుడు అన్నారు. కడపలో జరుగుతున్న మహానాడులో రాజకీయ తీర్మానం ప్రవేశపెట్టిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ‘‘పేదలు, బడుగు బలహీనవర్గాల కోసం
పుట్టిన పార్టీ తెదేపా. ఎన్టీఆర్ పార్టీని స్థాపించి నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. యువత, చదువుకునే వారిని ప్రోత్సహించారు. ‘సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లు’ సహా ఏ మూల సిద్ధాంతాలతో ఎన్టీఆర్
పార్టీని స్థాపించారో.. ఆ విధానాలను సీఎం చంద్రబాబు ముందుకు నడిపిస్తున్నారు. ఆటంకాలు లేకుండా తెదేపా, జనసేన, భాజపా పార్టీలు కూటమి ప్రభుత్వాన్ని పటిష్ఠంగా నడుపుతున్నాయి. సంక్షేమం, అభివృద్ధి
తెలుగుదేశం పార్టీతోనే మొదలయ్యాయి. తెదేపా హయాంలో పీపీపీ విధానంలో విమానాశ్రయాల నిర్మాణం చేపడుతున్నాం. ల్యాండ్ పూలింగ్ విధానం తీసుకొచ్చింది చంద్రబాబు. పాపులేషన్ మేనేజ్మెంట్ విధానానికి
శ్రీకారం చుడుతున్నారు. కోటి మంది సభ్యత్వాలు కలిగిన ఏకైక ప్రాంతీయ పార్టీ తెదేపా. ఎన్నో సంక్షోభాలను ఎదుర్కొంది. సంక్షోభాలను ఎదురొడ్డి విజయవంతంగా ముందుకు సాగింది’’ అని రామ్మోహన్ నాయుడు
అన్నారు.