
Piyush goyal: వివాదాల పరిష్కారానికి డబ్ల్యూటీఓలో బలమైన యంత్రాంగం: పీయూష్ గోయల్
Play all audios:

Piyush Goyal: సుంకాలతో సంబంధం లేకుండా ఎదురవుతున్న అడ్డంకులను ప్రపంచ వాణిజ్య సంస్థ తొలగించాలని కేంద్ర మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. Piyush Goyal | ఇంటర్నెట్ డెస్క్: సుంకాలతో సంబంధం లేకుండా
ఎదురవుతున్న వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించాలని ప్రపంచ వాణిజ్యసంస్థకు (WTO) కేంద్ర వాణిజ్యశాఖ మంత్రి పీయూష్ గోయల్ పిలుపునిచ్చారు. అసమాన వాణిజ్య విధానాలను సరిదిద్దాలని, బలమైన వివాద పరిష్కార
వ్యవస్థను పునరుద్ధరించాలన్నారు. తక్కువ అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాలకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. గత మంత్రివర్గ సమావేశాల్లో ముగింపు దశకు వచ్చిన అంశాలపై డబ్ల్యూటీఓ
దృష్టిసారించాలని సూచించారు. * భార్య వైపు చూస్తూ కూర్చోవడం గురించి మాట్లాడలేదు : నవ్వులు పూయించిన హర్ష్ గోయెంకా వాణిజ్యేతర అడ్డంకులను అరికట్టడం, వివాదాలకు కచ్చితమైన పరిష్కారం కోసం
డబ్ల్యూటీఓలో బలమైన వ్యవస్థను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని గోయల్ అన్నారు. ఆస్ట్రేలియా, సింగపూర్, ఫ్రాన్స్, నైజీరియాతో పాటు 25 దేశాల మంత్రులతో జరిగిన సమావేశంలో పాల్గొన్న గోయల్ ఈ వ్యాఖ్యలు
చేశారు. డబ్ల్యూటీఓ డైరెక్టర్ జనరల్ న్గోజీ ఒకోంజో-ఇవిమా కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు. వ్యవసాయ సమస్యలు, మత్స్య సంపద క్షీణత ఇలా అనేక విషయాల్ని ఈ సమావేశంలో చర్చించారు.