Elon musk: 2035 నాటికి రోడ్లపై డ్రైవర్‌లెస్‌ కార్లే: టెస్లా ఏఐ సాఫ్ట్‌వేర్‌ బాస్‌

Elon musk: 2035 నాటికి రోడ్లపై డ్రైవర్‌లెస్‌ కార్లే: టెస్లా ఏఐ సాఫ్ట్‌వేర్‌ బాస్‌

Play all audios:


Elon Musk | ఇంటర్నెట్‌ డెస్క్‌: విద్యుత్‌ కార్ల తయారీ సంస్థ టెస్లా (Tesla) ఏఐ సాఫ్ట్‌వేర్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా భారత సంతతికి చెందిన అశోక్​ఎల్లుస్వామి పనిచేస్తున్న విషయం తెలిసిందే. కంపెనీలో


కీలక పాత్ర పోషిస్తున్న ఆయన టెస్లా పనితీరు, ఎలాన్‌ మస్క్‌తో కలిసి పనిచేసిన అనుభవాన్ని పంచుకున్నారు. తాజాగా ఓ యూట్యూబర్‌ నిర్వహించిన పాడ్‌కాస్ట్‌లో పాల్గొన్న ఆయన మస్క్‌తో కలిసి పనిచేయడం చాలా


సరదాగా ఉంటుందని వ్యాఖ్యానించారు.  ‘‘ప్రస్తుతం కారు నడపాలంటే డ్రైవర్లపై ఆధారపడుతున్నాం. భవిష్యత్తులో టెక్నాలజీనే వాటన్నింటినీ చూసుకుంటుంది. 2035 నాటికి అన్నీ సెల్ఫ్‌ డ్రైవింగ్‌ కార్లే


తయారవుతాయి. రానున్న దశాబ్దం నాటికి రోడ్లపై అన్నీ ఈతరహా కార్లే చక్కర్లు కొడతాయి. భవిష్యత్తులో ఒకవేళ మీకు కారు నడపడం ఇష్టంగా ఉంటే పాత రకం కారును కొనుగోలు చేయాల్సి ఉంటుంది. డ్రైవర్‌ లెస్‌


కార్లదే భవిష్యత్తు’’ అని అశోక్‌ ఎల్లుస్వామి తెలిపారు. అమెరికాలోని కొన్ని నగరాల్లో టెస్లా డ్రైవర్‌-లెస్‌ కార్లను ప్రారంభించాలని చూస్తున్నామన్నారు. అన్ని కార్లూ ఒకే ఏఐ సాంకేతితకతో పనిచేస్తాయని


పేర్కొన్నారు. * ట్రంప్‌తో అంబానీ సమావేశం! మస్క్‌తో కలసి పనిచేసిన అనుభవం గురించి ఎల్లుస్వామి మాట్లాడుతూ.. రిస్క్‌ తీసుకోవడానికి టెస్లా అధినేత ఎప్పుడూ వెనకడుగు వేయరన్నారు. ‘‘మస్క్ చాలా


తెలివైనవారు. భవిష్యత్తును ముందుగానే అంచనా వేయగలరు. చాలా కష్టపడి పనిచేస్తారు. వారానికి 80-90 గంటలు శ్రమిస్తారు. ఆయనతో కలిసి పనిచేయడం అదృష్టంగా భావిస్తున్నా’’ అని అన్నారు. మస్క్‌ చాలా సరదాగా


ఉంటారని తెలిపారు. ఆయన దూరదృష్టి సాటిలేనిదన్నారు. ఈ బిలియనీర్‌ పనితీరు, సాంకేతికతపై పట్టు కంపెనీ విజయానికి కారణమన్నారు.  టెస్లా ఆటోపైలట్‌ బృందంలో చేరిన మొదటి వ్యక్తి అశోక్‌ ఎల్లుస్వామి.


కృత్రిమ మేధ, ఆటోపైలట్‌ సాఫ్ట్‌వేర్‌లో టెస్లా సాధించిన విజయంలో అశోక్‌ కీలక పాత్ర పోషించారు. ఈ విషయంపై ఎలాన్‌ మస్క్‌ అశోక్‌, అతని బృందానికి కృతజ్ఞతలు తెలిపిన విషయం తెలిసిందే.