
ఉత్తరాఖండ్లో కూలిన హెలికాప్టర్.. మృతుల్లో ఎంపీ సోదరి
Play all audios:

రాంనగర్ (అనంతపురం): ఉత్తరాఖండ్లో జరిగిన ఘోర హెలికాప్టర్ ప్రమాదంలో మృతుల సంఖ్య ఆరుకి చేరింది. వీరిలో ఇద్దరు ఏపీ వాసులు ఉన్నారు. మరొకరు గాయపడ్డారు. అనంతపురం ఎంపీ లక్ష్మీనారాయణ సోదరి
వేదవతితో పాటు విజయారెడ్డి అనే మహిళ ఈ ప్రమాదంలో మృతిచెందినట్లు అధికారులు నిర్ధరించారు. వేదవతి భర్త భాస్కర్ గాయాలతో బయటపడ్డారు. దీంతో ఆయన్ను చికిత్స నిమిత్తం రుషికేశ్ ఎయిమ్స్కు తరలించారు.
గురువారం ఉదయం పర్యాటకులతో వెళ్తున్న ఓ ప్రైవేటు హెలికాప్టర్ కుప్పకూలిపోయింది. ఉత్తరకాశీలో గంగోత్రి వైపు వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు, పోలీసులు ఘటనా
స్థలానికి చేరుకున్నారు. ప్రమాద సమయంలో హెలికాప్టర్లో ఏడుగురు ప్రయాణికులు ఉన్నారు.