
Travel bookings: పాక్కు మద్దతు.. ఆ దేశాలకు ‘ట్రావెల్’ సంస్థల బుకింగ్లు బంద్
Play all audios:

భారత్- పాక్ మధ్య తీవ్ర ఉద్రిక్తతలు నెలకొన్న వేళ.. అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్ ప్లాట్ఫాంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. ఇంటర్నెట్ డెస్క్: భారత్- పాకిస్థాన్
మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దాయాది దేశం దుందుడుకు చర్యలను భారత్ సమర్థంగా తిప్పికొడుతోంది. ఈ పరిణామాల నడుమ అంతర్జాతీయ ట్రావెల్ బుకింగ్ సేవలు అందించే పలు ఆన్లైన్
ప్లాట్ఫాంలు కీలక నిర్ణయం తీసుకున్నాయి. పాక్కు మద్దతుగా నిలుస్తున్న తుర్కియే, అజర్బైజాన్ వంటి దేశాలకు కొత్త బుకింగ్లను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి. ఈ దేశాలకు అనవసర ప్రయాణాలు
మానుకోవాలని, అక్కడి సున్నితమైన ప్రాంతాల పర్యటన ప్రణాళికల విషయంలో అప్రమత్తతంగా వ్యవహరించాలని తెలిపాయి. * తుర్కియే, అజర్బైజాన్, ఉజ్బెకిస్థాన్లకు నూతన బుకింగ్లను తాత్కాలికంగా నిలిపేయాలని
నిర్ణయించినట్లు పర్యాటక సేవల బ్రాండ్ ‘కాక్స్ అండ్ కింగ్స్’ వెల్లడించింది. ఈ దేశాలకు అనవసరమైన ప్రయాణాలు మానుకోవాలని భారత ప్రయాణికులకు కాక్స్ అండ్ కింగ్స్ డైరెక్టర్ కరణ్ అగర్వాల్ సూచన
చేశారు. * పహల్గాం దాడి, తదనంతరం పరిణామాల నేపథ్యంలో ప్రయాణికులు అప్రమత్తంగా వ్యవహరించాలని ఈజ్మైట్రిప్ తెలిపింది. అత్యవసరమైతేనే తుర్కియే, అజర్బైజాన్లను సందర్శించాలని సూచించింది. ట్రిప్
ప్లానింగ్కు ముందు ట్రావెల్ అడ్వైజరీలను పరిగణనలోకి తీసుకోవాలని ఈజ్మైట్రిప్ వ్యవస్థాపకుడు నిశాంత్ ట్వీట్ చేశారు. మ్యాటర్ వీక్.. ప్రచారం పీక్.. దాయాది ఫేక్ వార్! * తుర్కియే,
అజర్బైజాన్లకు అన్ని ప్రయాణ ప్యాకేజీలను నిలిపివేసినట్లు ట్రావోమింట్ తెలిపింది. ఈ దేశాలకు ఇప్పటికే చేసుకున్న బుకింగ్లపై క్యాన్సలేషన్ ఫీజు వసూలు చేయబోమని వెల్లడించింది. అయితే.. అత్యవసర
పరిస్థితుల్లో ఎమర్జెన్సీ ఫ్లైట్ బుకింగ్లు అందుబాటులో ఉంటాయని చెప్పింది. మరోవైపు.. జమ్మూకశ్మీర్, పంజాబ్, రాజస్థాన్ తదితర రాష్ట్రాల్లో హోటల్ బుకింగ్లు రద్దవుతున్నట్లు సంబంధిత
ప్రతినిధులు తెలిపారు.