Boycott turkey: ఉద్రిక్తతల వేళ.. ఊపందుకున్న ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ నినాదం

Boycott turkey: ఉద్రిక్తతల వేళ.. ఊపందుకున్న ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ నినాదం

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: పాకిస్థాన్‌లోని ఉగ్రవాదులు, వారి స్థావరాలను అంతం చేయడమే లక్ష్యంగా ఆపరేషన్ సిందూర్‌ (Operation Sindoor)ను భారత్‌ చేపట్టగా.. ఆ సమయంలో పాకిస్థాన్‌కు తుర్కియే అనుకూలంగా


వ్యవహరించిన సంగతి తెలిసిందే. దీంతో ఎర్డోగాన్‌ ప్రభుత్వం తీరుపై మనదేశంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. ‘బాయ్‌కాట్‌ తుర్కియే’ (Boycott Turkey) పేరుతో సోషల్‌ మీడియాలో విస్తృత ప్రచారం జరిగింది.


తాజాగా ‘బ్యాన్‌ తుర్కియే’ అంటూ పలువురు వ్యాపారులు కూడా ఆ దేశం నుంచి దిగుమతి అయ్యే వస్తువులను విక్రయించేందుకు నిరాకరిస్తున్నారు. పాక్‌తో ఉద్రిక్త పరిస్థితుల వేళ దేశంలో బాయ్‌కాట్‌ తుర్కియే


నినాదం ఊపందుకుంది. ఈ క్రమంలో తాజాగా పుణెలోని వ్యాపారులు కూడా ఆ దేశం యాపిల్‌లను (Turkey Apple) బహిష్కరిస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నారు. దీంతో స్థానిక మార్కెట్‌లో అవి కనిపించకుండా పోతున్నాయి.


స్థానికులు కూడా ఇతర ప్రదేశాల నుంచి దిగుమతయ్యే పండ్లను తీసుకుంటున్నారు. ఇతర ప్రాంతాల నుంచి దిగుమతి.. పుణెలో మార్కెట్‌లో తుర్కియే యాపిల్‌ల సీజన్‌ టర్నోవర్‌ రూ.1000 నుంచి 1200 కోట్ల వరకు


ఉంటుందని అంచనా. దీంతో వ్యాపారుల తాజా నిర్ణయం పండ్ల మార్కెట్‌పై తీవ్ర ప్రభావాన్ని చూపనున్నట్లు తెలుస్తోంది. అయినప్పటికీ వర్తకులు మాత్రం.. దీన్ని ఆర్థిక నిర్ణయంగా మాత్రమే కాదని, ప్రభుత్వానికి,


సాయుధ బలగాలకు సంఘీభావంగా చూస్తున్నామని పేర్కొంటున్నారు. యాపిల్‌లను అక్కడ నుంచి దిగుమతి చేసుకునే బదులు హిమాచల్‌, ఉత్తరాఖండ్‌, ఇరాన్, ఇతర ప్రాంతాల నుంచి కొనుగోలు చేస్తున్నామని చెబుతున్నారు. *


భూగర్భ సొరంగాలు.. అణు కార్యక్రమాలు..! @ కిరానా హిల్స్‌ మరోవైపు, హిమాచల్‌ ప్రదేశ్‌కు చెందిన కాంగ్రెస్‌ నేత కుల్‌దీప్‌ సింగ్‌ రాథోడ్‌ కూడా తుర్కియే తీరుపై ఇటీవల తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.


2023లో భీకర భూకంప సమయంలో ‘ఆపరేషన్‌ దోస్త్’ ద్వారా భారత్‌ ఆ దేశానికి ఎంతో సాయం చేసిందని, అయినప్పటికీ ఆ దేశం దౌత్య ద్రోహానికి పాల్పడిందని ఆరోపించారు. ఈ సందర్భంగా అక్కడి దిగుమతులపై నిషేధం


విధించాలని డిమాండ్‌ చేశారు. భారత్‌పై ద్వేషం.. ఇదిలాఉంటే, ఆపరేషన్‌ సిందూర్‌ సమయంలో పాకిస్థాన్‌కు సైనిక విమానాలు, యుద్ధనౌకను తుర్కియే పంపించినట్లు వార్తలు వచ్చాయి. ఆ ఆయుధాలనే భారత్‌పై


పాకిస్థాన్‌ ప్రయోగిస్తోందని సమాచారం. పహల్గాం దాడి జరిగిన తర్వాత ముస్లిం దేశాల్లో తుర్కియే, అజర్‌ బైజాన్‌ మాత్రమే పాక్‌కు మద్దతిస్తూ ప్రకటనలిచ్చాయి. కశ్మీర్‌ అంశంలో గతంలో ఎర్డోగాన్‌ అనేక


సార్లు అంతర్జాతీయ వేదికలపై బహిరంగంగా భారత్‌పై విమర్శలు గుప్పించిన సంగతి తెలిసిందే.