
Operation sindoor: మన సైనికులు రాత్రి ఒక చరిత్ర సృష్టించారు: రాజ్నాథ్ సింగ్
Play all audios:

ఇంటర్నెట్డెస్క్: ‘ఆపరేషన్ సిందూర్’ ద్వారా పాకిస్థాన్కు గట్టి జవాబిచ్చామని కేంద్ర రక్షణమంత్రి రాజ్నాథ్ సింగ్ పేర్కొన్నారు. రాత్రికిరాత్రి మన సైనికులు చరిత్ర సృష్టించారని కొనియాడారు.
అలాగే సైనికులకు పూర్తి స్వేచ్ఛ ఇచ్చిన ప్రధాని మోదీకి ధన్యవాదాలు చెప్పారు. ఆరు రాష్ట్రాలు, రెండు కేంద్రపాలిత ప్రాంతాలలో బోర్డర్ రోడ్స్ ఆర్గనైజేషన్కు చెందిన ప్రాజెక్టులను ప్రారంభించిన
సందర్భంగా మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. దేశవ్యాప్తంగా మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కట్టుబడి ఉన్నామని చెప్పారు (Operation Sindoor). ‘‘మన సైనికులు రాత్రి అద్భుత పరాక్రమం ప్రదర్శించారు.
ఉగ్రవాద శిబిరాలపై సాహసోపేతమైన దాడులు చేసి సత్తా చాటారు. ఈ క్రమంలో సాధారణ పౌరులకు ఎలాంటి ఇబ్బంది కలిగించలేదు. ఉగ్ర శిబిరాలనే లక్ష్యంగా చేసుకున్నారు. పహల్గాంలో అమాయకపౌరులను చంపిన వారినే
మట్టుపెట్టాం. దేశ భద్రతకు భంగం కలిగించే చర్యలను సహించం. భారత్ లక్ష్యం పాక్ కాదు.. ఉగ్రవాదులు. ధైర్యసాహసాలు ప్రదర్శించిన మన సైనికులు ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఇక సరిహద్దు రాష్ట్రాల
విషయంలో పూర్తి అప్రమత్తతతో ఉన్నాం’’ అని మంత్రి వెల్లడించారు. పహల్గాం ఉగ్రదాడి (Pahalgam Terror Attack)తో భారత్, పాక్ల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్న వేళ మనదేశం ప్రతీకార
చర్యలు చేపట్టింది. భారత్పై సీమాంతర ఉగ్రదాడులకు కుట్రపన్నినట్లు భావిస్తున్న మొత్తం తొమ్మిది స్థావరాలపై ఆర్మీ దాడులు చేపట్టింది. పూర్తి కచ్చితత్వంతో దాడులు చేసినట్లు పేర్కొంది. ఉద్రిక్త
పరిస్థితులకు తావులేకుండా.. పాక్ సైనిక సదుపాయాలపై ఎక్కడా దాడులు చేపట్టలేదని భారత ప్రభుత్వం పేర్కొంది. ఆపరేషన్ సిందూర్పై పలువురు కేంద్ర మంత్రులు, ప్రముఖులు సోషల్ మీడియా వేదికగా
స్పందించారు. ‘ఆపరేషన్ సిందూర్’ అనంతరం ‘భారత్ మాతా కీ జై’ పేరుతో పోస్టులు పెట్టారు.