
Flight operations: భారత్- పాక్ ఉద్రిక్తతలు తగ్గుముఖం.. ఆ ప్రాంతాల్లో విమాన సర్వీసులు షురూ
Play all audios:

భారత్- పాక్ల మధ్య కాల్పుల విరమణ కొనసాతున్న వేళ మంగళవారం నుంచి శ్రీనగర్లో విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంటర్నెట్ డెస్క్: భారత్- పాక్ల మధ్య కాల్పుల
విరమణ కొనసాతున్న వేళ మంగళవారం నుంచి శ్రీనగర్లో విమాన సర్వీసులు పునఃప్రారంభం కానున్నట్లు అధికారులు వెల్లడించారు. ఈ మేరకు దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాల్లో కూడా విమానాల కార్యకలాపాలను
పునరుద్ధరించనున్నట్లు సోమవారం ప్రకటించారు. భారత్- పాకిస్థాన్ ఉద్రిక్తతల నేపథ్యంలో గతకొన్ని రోజులుగా దేశంలోని 32 విమానాశ్రయాలను తాత్కాలికంగా మూసివేసిన విషయం తెలిసిందే. కాగా.. తాజాగా
ఇరుదేశాల మధ్య కాల్పుల విరమణ ఒప్పందంతో సరిహద్దు ప్రాంతాల్లో ఉద్రిక్తతలు తగ్గుముఖం పట్టాయి. ఈ తరుణంలో విమానాశ్రయాలు మూసివేస్తూ జారీ చేసిన నోటమ్(NOTAM)ను రద్దు చేస్తున్నట్లు అధికారులు
ప్రకటించారు. దీంతో దేశంలోని పలు ప్రాంతాల్లో విమాయాన సంస్థలు యథావిధిగా తమ సర్వీసులను కొనసాగించనున్నాయి. * ఆపరేషన్ సిందూర్.. దేశ వ్యాప్తంగా భాజపా ‘తిరంగా యాత్ర’! ఇదిలా ఉంటే.. విమానాశ్రయాల
మూసివేతతో పలు విమానయాన సంస్థలు తీవ్రంగా నష్టపోయాయి. ఈ క్రమంలోనే నష్టాలను భర్తీ చేయడానికి స్పైస్జెట్ అదనపు విమానాలను నడపనున్నట్లు సమాచారం. అయితే శ్రీనగర్ విమానాశ్రయం మూసివేయడంతో హజ్ యాత్రకు
వెళ్లే విమానాలపైనా తీవ్ర ప్రభావం పడిందని అధికారులు తెలిపారు.