
Dk shivakumar: తొక్కిసలాట ఘటన నుంచి పాఠాలు నేర్చుకున్నాం: డీకే శివకుమార్
Play all audios:

చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట ఘటన నుంచి పాఠాలు నేర్చుకున్నామని కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ అన్నారు. దిల్లీ: ఐపీఎల్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB) విజయోత్సవం వేళ
బెంగళూరు (Bengaluru stampede) చిన్నస్వామి స్టేడియం వద్ద జరిగిన తొక్కిసలాట పెను విషాదం రేపిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై కర్ణాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ (DK Shivakumar) మరోసారి స్పందించారు.
ఈ ఘటనతో రాష్ట్రం ఎన్నో పాఠాలు నేర్చుకుందని అన్నారు. దిల్లీలో మున్సిపల్ కార్పొరేషన్ మేయర్తో సమావేశం పూర్తయిన అనంతరం డీకే మీడియాతో మాట్లాడారు. ‘‘తొక్కిసలాట ఘటనతో రాష్ట్రం ఎన్నో పాఠాలు
నేర్చుకుంది. ఇకపై ఇలాంటి తప్పిదాలు జరగకుండా సరైన ప్రణాళికలు రూపొందిస్తాం. బహిరంగ కార్యక్రమాల నిర్వహణ విషయంలో ఓ చట్టాన్ని తీసుకురావాలని భావిస్తున్నాం’’ అని డీకే పేర్కొన్నారు. ఈ ఘటనకు
కాంగ్రెస్ ప్రభుత్వం కారణమంటూ ప్రతిపక్షాలు చేస్తున్న ఆరోపణలపై ఆయన స్పందించారు. * నేను చంపలేదు.. నన్నే కిడ్నాప్ చేశారు: హనీమూన్ హత్య కేసు నిందితురాలు సోనమ్ కాగా.. ఆర్సీబీ విజయోత్సవాల వేళ
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వద్ద తొక్కిసలాట ఘటనలో పెను ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో 11 మంది ప్రాణాలు కోల్పోయారు. పలువురికి తీవ్ర గాయాలైన సంగతి తెలిసిందే. ప్రతిపక్షాలు కాంగ్రెస్
ప్రభుత్వంపై విమర్శల బాణాలు ఎక్కుపెడుతున్నాయి. మరోవైపు, ఆర్సీబీ, ఈవెంట్ మేనేజ్మెంట్ సంస్థ డీఎన్ఏ ఎంటర్టైన్మెంట్ నెట్వర్క్స్, కర్ణాటక క్రికెట్ అసోసియేషన్(కేఎస్సీఏ) సహా తొక్కిసలాటతో
సంబంధం ఉన్న పలువురిపై కేసులు నమోదయ్యాయి.