
Ashwini vaishnaw: మరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం
Play all audios:

ఉత్తరప్రదేశ్లోని జెవార్లో ఆరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇంటర్నెట్ డెస్క్: సెమీ కండక్టర్ల (semiconductor) విషయంలో దేశం స్వావలంబన సాధించే
దిశగా కేంద్రం మందడుగు వేసింది. మరో సెమీ కండక్టర్ యూనిట్ ఏర్పాటుకు కేంద్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. రూ.3,707 కోట్ల పెట్టుబడితో ఉత్తరప్రదేశ్లోని జెవార్లో ఆరో యూనిట్ ఏర్పాటుకు గ్రీన్
సిగ్నల్ ఇచ్చింది. ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తి రంగంలో ప్రపంచ ప్రసిద్ధి గాంచిన ‘హోన్ హాయ్ టెక్నాలజీ’ గ్రూప్నకు చెందిన ‘ఫాక్స్కాన్’ (Foxconn).. హెచ్సీఎల్ సంయుక్తంగా ఈ సెమీకండక్టర్
ప్లాంట్ను ఏర్పాటు చేస్తున్నాయని కేంద్ర మంత్రి అశ్వినీ వైష్ణవ్ తెలిపారు. ఇది మొబైల్ ఫోన్లు, ల్యాప్టాప్లు, ఆటోమొబైల్స్ ఇతర పరికరాల కోసం డిస్ప్లే డ్రైవర్ చిప్లను తయారు చేస్తుందని
పేర్కొన్నారు. సెమీ కండక్టర్ల రంగాన్ని మరింత ప్రోత్సహించే క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నట్లు అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.ఈ సెమీకండక్టర్ యూనిట్ నిర్మాణంతో దాదాపు 2వేల మందికి ఉపాధి లభిస్తుందని
అన్నారు. సెమీ కండక్టర్ యూనిట్లలో నెలకు 3.6 కోట్ల చిప్లను ఉత్పత్తి చేస్తామని పేర్కొన్నారు. కండక్టర్లకు వాడే పరికరాలు కూడా భారత్లో తయారు చేయడానికి కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. ప్రస్తుతం
దాదాపు 60 శాతం సెమీకండక్టర్ల పరికరాలను అమెరికా కంపెనీలే ఉత్పత్తి చేస్తున్నట్లు తెలిపారు. ఈ సాంకేతికతపై దాదాపు 70 స్టార్టప్లు పని చేస్తున్నాయని అశ్వినీ వైష్ణవ్ వెల్లడించారు. కొత్త విద్యా
విధానం ద్వారా అకడమిక్ విద్య, పరిశ్రమల అనుసంధానానికి అవకాశాలు ఉన్నాయన్నారు. పరిశ్రమల అవసరాల మేరకు విద్యార్థులు సన్నద్ధం అవుతున్నారని పేర్కొన్నారు. ఇందులో భాగంగా 270 విద్యా సంస్థల్లో
విద్యార్థులకు సెమీ కండక్టర్ల సాంకేతికతపై శిక్షణనిస్తున్నట్లు తెలిపారు. విద్యార్థులు రూపొందించిన చిప్లను మొహాలీలో ఉత్పత్తి చేశారని..వాటి తయారీలో గణనీయమైన మార్పులు వచ్చినట్లు పేర్కొన్నారు.
టెలికాం విభాగం కోసం యూనివర్సిటీలో 5జీ ల్యాబ్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ప్రస్తుతం యూనివర్సిటీల్లో ఇన్క్యుబేటర్ల ఏర్పాటు జరుగుతోందని అన్నారు.