
Operation sindoor: సైన్యం ఆపరేషన్ల కవరేజీలో జాగ్రత్త: మీడియా సంస్థలకు రక్షణశాఖ సూచన
Play all audios:

ఇంటర్నెట్డెస్క్: దేశ భద్రతకు సంబంధించిన ఆపరేషన్ వార్తలు, దళాల కదలికల కవరేజీల విషయంలో మీడియా కొంత సంయమనం పాటించాలని రక్షణశాఖ ఓ ప్రకటనలో సూచించింది. ‘భద్రతా దళాల ఆపరేషన్ల ఫలితాలను ప్రభావితం
చేసే సమాచారాన్ని వెల్లడిస్తే.. వారి ప్రాణాలకు ముప్పు కూడా రావచ్చు. గతంలో కూడా కార్గిల్ యుద్ధం, 26/11 దాడులు, కాందహార్ హైజాక్ ఘటనలు అత్యుత్సాహపు రిపోర్టింగ్కు నిదర్శనగా నిలిచాయి. కేబుల్
టెలివిజన్ చట్టం ప్రకారం.. ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ల సమయంలో కేవలం అర్హత ఉన్న అధికారి సమయానుసారం బ్రీఫింగ్స్ ఇచ్చేందుకు అర్హులు. ఈ క్రమంలో అందరూ అప్రమత్తంగా వ్యవహరించి.. సున్నితంగా,
బాధ్యతాయుతంగా కవర్ చేయాలి’’ అని పేర్కొంది. మరోవైపు కేంద్ర ప్రభుత్వం కూడా ఆపరేషన్ సిందూర్ (Operation Sindoor) వేళ తప్పుడు వార్తలు ప్రచారంలోకి రాకుండా చర్యలు తీసుకొంటోంది. పీఐబీ ఫ్యాక్ట్
చెక్లు నిర్వహిస్తోంది. ఇంతకుముందు గుజరాత్లోని పోర్టు సహా, జలంధర్లో డ్రోన్, క్షిపణి దాడుల దృశ్యాలంటూ సోషల్ మీడియాలో పాక్ అనుకూల వ్యక్తులు వీడియోలు షేర్ చేసిన సంగతి తెలిసిందే. వీటిని
భారత్ తిప్పికొట్టింది. పీఐబీ ఫ్యాక్ట్చెక్ చేసి.. అవన్నీ అవాస్తవేమనని తేల్చింది.