
Ranya rao: గోల్డ్ స్మగ్లింగ్ కేసు.. రన్యారావుకు బెయిల్ వచ్చినా జైల్లోనే
Play all audios:

బెంగళూరు: బంగారం అక్రమ రవాణా కేసులో (Gold Smuggling Case) అరెస్టయిన కన్నడ నటి రన్యారావుకు (Ranya Rao) స్పెషల్ న్యాయస్థానం ప్రత్యేక షరతులతో బెయిల్ మంజూరు చేసింది. అయినప్పటికీ ఆమె జైల్లోనే
ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. విదేశీ మారక ద్రవ్య పరిరక్షణ, స్మగ్లింగ్ కార్యకలాపాల నిరోధక చట్టం (కాఫిఫోసా చట్టం) కింద నమోదైన కేసులో ఆమెకు ఊరట లభించకపోవడమే అందుకు కారణం. దీంతో నటి
కారాగారంలోనే ఉండనున్నారు. గోల్డ్ స్మగ్లింగ్ కేసులో డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్ (డీఆర్ఐ) ఛార్జీషీట్ దాఖలు చేయడంలో విఫలమైందన్న న్యాయస్థానం.. రన్యారావుతో పాటు ఈ కేసులో మరో
నిందితుడు తరుణ్ కొండూరు రాజుకు రూ.2 లక్షల పూచీకత్తుపై బెయిల్ మంజూరు చేసింది. అయితే.. దేశం విడిచి వెళ్లిపోయే ప్రయత్నాలు చేయకూడదని హెచ్చరించింది. జాప్యం చేయకుండా విచారణకు హాజరుకావాలని..
సాక్ష్యాలను, సాక్ష్యులను ప్రభావితం చేయకూడదని తెలిపింది. * ‘బలోచిస్థాన్’పై సీఎం హిమంత బిశ్వశర్మ కీలక వ్యాఖ్యలు.. ఏమన్నారంటే? దుబాయ్ నుంచి బంగారాన్ని అక్రమంగా తరలిస్తూ రన్యారావు కొన్ని
రోజుల క్రితం బెంగళూరు విమానాశ్రయంలో దొరికిపోయిన విషయం తెలిసిందే. ఆమె వద్ద నుంచి 14.7 కిలోల బంగారాన్ని డీఆర్ఐ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. అయితే.. బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వు చేసిన
కర్ణాటక హైకోర్టు దానిని కొట్టి వేసిన సంగతి తెలిసిందే. దీంతో కాఫిఫోసా చట్టం కింద వారికి ఏడాది పాటు బెయిలు లభించదని అధికారులు పేర్కొన్నారు. తాజాగా ప్రత్యేక కోర్టు నటికి బెయిల్ మంజూరు
చేసినప్పటికీ.. కాఫిఫోసా చట్టం కింద నమోదైన కేసులో ఊరట దక్కలేదు.