Jagdeep dhankhar: ‘ఆపరేషన్‌ సిందూర్‌.. ’ ఉగ్రమూకలు ఎక్కడున్నా ఏరివేస్తామనే సందేశం ఇచ్చాం: ఉపరాష్ట్రపతి

Jagdeep dhankhar: ‘ఆపరేషన్‌ సిందూర్‌.. ’ ఉగ్రమూకలు ఎక్కడున్నా ఏరివేస్తామనే సందేశం ఇచ్చాం: ఉపరాష్ట్రపతి

Play all audios:


పహల్గాం ఉగ్రదాడికి ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (operation Sindoor)పై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌(Jagdeep Dhankhar) ప్రశంసలు కురిపించారు. పనాజీ: పహల్గాం ఉగ్రదాడికి


ప్రతీకారంగా భారత సైన్యం చేపట్టిన ‘ఆపరేషన్‌ సిందూర్‌’ (operation Sindoor)పై ఉపరాష్ట్రపతి జగదీప్‌ ధన్‌ఖడ్‌(Jagdeep Dhankhar) ప్రశంసలు కురిపించారు. ఈ ఆపరేషన్‌ ద్వారా ఉగ్రవాదానికి శిక్ష తప్పదని,


ఉగ్రమూకలను ఎక్కడ దాక్కున్నా ఏరివేస్తామనే సందేశాన్ని పొరుగు దేశాలతో పాటు ప్రపంచ దేశాలకు ప్రధాని నరేంద్ర మోదీ(PM Modi)ఇచ్చారన్నారు. భారత్‌ ఇప్పుడు ఎంతో భిన్నమైందని, విశ్వాసం, ధైర్యంతో


ఉందన్నారు. ఉగ్రవాదాన్ని ఎట్టిపరిస్థితుల్లో ఉపేక్షించేది లేదని తెలిపారు. గోవా రాజ్‌భవన్‌లోని వామన్ వృక్షకళా ఉద్యానవనంలో ప్రాచీన భారతీయ వైద్యులు చరక, సుశ్రూతుల కాంస్య విగ్రహాలను ఆవిష్కరించిన


అనంతరం ఆయన మాట్లాడారు. * ముందు మీ రెండు చికెన్స్ నెక్‌లు జాగ్రత్త: బంగ్లాకు అస్సాం సీఎం స్ట్రాంగ్‌ మెసేజ్‌  దేశం గర్వపడేలా చేసినందుకు సాయుధ దళాలకు సెల్యూట్‌ చేస్తున్నట్లు చెప్పారు.  ఆపరేషన్‌


సిందూర్‌ సమయంలో శత్రువుల స్థావరాలను కచ్చితంగా అంచనావేసి లక్ష్యాలను ఛేదించిన భారతీయ సాయుధ దళాల శక్తిని ప్రపంచం గుర్తించిందని ధన్‌ఖడ్‌ తెలిపారు.