Chiranjeevi: మీలాంటి అభిమానులు ఉండడం నాకూ ఆనందమే.. శేఖర్‌ కమ్ములపై చిరంజీవి పోస్ట్‌..

Chiranjeevi: మీలాంటి అభిమానులు ఉండడం నాకూ ఆనందమే.. శేఖర్‌ కమ్ములపై చిరంజీవి పోస్ట్‌..

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: దర్శకుడు శేఖర్‌ కమ్ములపై చిరంజీవి (Chiranjeevi) ప్రశంసలు కురిపించారు. ఆయన మరెన్నో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని కోరుకున్నారు. పెన్నును బహుమతిగా ఇచ్చారు. తాను ఇండస్ట్రీకి


వచ్చి 25 ఏళ్లు అయిన సందర్భంగా శేఖర్‌ కమ్ముల ఇటీవల చిరంజీవిని కలిసిన విషయం తెలిసిందే. కలలను వెంటాడితే విజయం తప్పకుండా మనల్ని ఫాలో అవుతుందని నమ్మకం ఇచ్చిన వ్యక్తి చిరంజీవి అని.. తన 25 ఏళ్ల


ప్రయాణాన్ని ఆయన సమక్షంలో చేసుకోవడం ఆనందంగా ఉందని తెలిపారు. ఆ ఫొటోలనే ఇప్పుడు చిరు షేర్‌ చేశారు. ‘‘మీలాంటి అభిమానులు ఉండడం నాకూ ఆనందమే. మీ ప్రస్థానానికి నేను స్ఫూర్తినిచ్చానని తెలిసి మరింత


సంతోషించాను. మీ 25 ఏళ్ల జర్నీలో నేనూ భాగమైనందుకు గర్వంగా ఉంది. సున్నితమైన వినోదంతో పాటు సందేశాన్ని జోడిస్తూ ఆలోచనాత్మకంగా తీసే మీ సినిమాలంటే నాకు ఎంతో ఇష్టం. ఫిల్మ్‌ మేకింగ్‌లో మీ కంటూ


ప్రత్యేకతను క్రియేట్‌ చేసుకున్నారు. మీరు ఇలాగే మరో 25 ఏళ్లు జనరంజకమైన సినిమాలు తీస్తూ మరెన్నో ఉన్నత శిఖరాలు అధిరోహించాలని కోరుకుంటున్నాను’’ అని చిరు తన పోస్ట్‌లో రాసుకొచ్చారు.  * మీరేమైనా


చరిత్రకారులా?.. కమల్‌హాసన్‌కు కర్ణాటక హైకోర్టు ప్రశ్న ఇక సినిమాల విషయానికొస్తే.. చిరంజీవి ప్రస్తుతం ‘విశ్వంభర’తో బిజీగా ఉన్నారు. శేఖర్‌ కమ్ముల దర్శకత్వం వహించిన ‘కుబేర’ విడుదలకు సిద్ధంగా


ఉంది. ధనుష్‌, నాగార్జున ప్రధానపాత్రల్లో నటించిన ఈ చిత్రం జూన్‌ 20న ప్రేక్షకుల ముందుకు రానుంది.