
Kenishaa francis: ఏదైనా ఉంటే డైరెక్ట్గా నాతో చెప్పండి.. : నటుడి భార్య పోస్ట్పై స్పందించిన గాయని
Play all audios:

జయం రవి, కెనీషా రిలేషన్లో ఉన్నట్లు ఎంతో కాలం నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఈనేపథ్యంలోనే కెనీషా పెట్టిన ఓ పోస్ట్ వైరల్ అయింది. ఇంటర్నెట్డెస్క్: నటుడు జయం రవి (Jayam Ravi),
గాయని కెనీషా రిలేషన్లో ఉన్నట్లు ఎంతోకాలం నుంచి వార్తలు వస్తోన్న విషయం తెలిసిందే. ఆయా వార్తల్లో నిజం లేదని వీరిద్దరూ ఇప్పటికే పలు సందర్భాల్లో చెప్పినప్పటికీ ఆ వార్తలు మాత్రం ఆగడం లేదు. ఇదిలా
ఉండగా, ఇటీవల ఓ పెళ్లి వేడుకకు రవి-కెనీషా కలిసి హాజరు కావడం ఆయా వార్తలకు మరింత ఆజ్యం పోసినట్లు అయింది. దీంతో రవి సతీమణి ఆర్తి ఒక స్టేట్మెంట్ రిలీజ్ చేశారు. దీనిపై తాజాగా కెనీషా పరోక్షంగా
స్పందించారు. ఏదైనా ఉంటే నేరుగా తనకే చెప్పమన్నారు. అంతేకాకుండా, ఆర్తికి సపోర్ట్ చేస్తూ తనపై విమర్శలు చేస్తోన్న మహిళలను ఉద్దేశించి కూడా ఆమె మాట్లాడారు. ఎవరి పని వాళ్లు చూసుకుంటే మంచిదన్నట్లు
తెలిపారు. ‘‘నాతో ఏదైనా చెప్పాలనుకుంటే నన్నే సంప్రదించండి. నేరుగా నా ముఖంపై చెప్పండి. మీరు ఏం అనుకుంటున్నారో నాక్కూడా తెలుస్తుంది కదా! పీఆర్లను ఉపయోగించాల్సిన అవసరం లేదు. సొంత విషయాలు
పట్టించుకోవడం మానేసి ఎవరైతే కేకలు వేస్తున్నారో ఒక్కసారి నా ముందుకు రండి. ఇతరుల దృష్టిని ఆకర్షించాలని మీరందరూ ఇప్పుడు కోరుకుంటున్నారని నాకు అనిపిస్తుంది. మీకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. మీ
అందరూ ప్రశాంతంగా జీవించాలని కోరుకుంటున్నా. మీరందరూ సపోర్ట్ అందిస్తున్నందుకు ధన్యవాదాలు’’ అని ఆమె రాసుకొచ్చారు. * జూన్/జులైలోనే ‘స్టార్’ మెరుపులు: ఏ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు?
తాను విడాకులు తీసుకుంటున్నట్లు గతేడాది జయం రవి ప్రకటించారు. విడాకుల గురించి తనని సంప్రదించకుండానే ఆయన ప్రకటించారని ఆర్తి ఆరోపించారు. ఈ క్రమంంలోనే వీరిద్దరూ గతేడాది న్యాయస్థానాన్ని
ఆశ్రయించారు. ప్రస్తుతం వీరి విడాకుల కేసు విచారణలో ఉంది. ‘తండ్రి అంటే టైటిల్ మాత్రమే కాదు అదో బాధ్యత. విడాకుల విషయంలో తుది తీర్పు వెలువడే వరకూ నా ఇన్స్టాగ్రామ్ ఖాతా పేరు ఆర్తి రవి అనే
ఉంటుంది. ఇప్పటికీ నాన్నా అని నిన్ను పిలుస్తున్న పిల్లల కోసం నిలబడ్డా’’ అని ఆర్తి పేర్కొన్నారు. ఆమెకు సపోర్ట్ చేస్తూ ఖుష్బూ, రాధిక సోషల్మీడియాలో సందేశాలు పెట్టారు. ధైర్యంగా ఉండమని, నిజం
తప్పకుండా గెలుస్తుందని తెలిపారు.