Simran: ఆమె నాకు సారీ చెప్పింది.. వివాదంపై స్పందించిన సిమ్రన్‌..

Simran: ఆమె నాకు సారీ చెప్పింది.. వివాదంపై స్పందించిన సిమ్రన్‌..

Play all audios:


ఇటీవల ఒక నటిని ఉద్దేశించి తాను చేసిన కామెంట్స్‌పై సిమ్రన్‌ స్పందించారు. తన సందేశం ఆ నటికి చేరిందని ఆమె క్షమాపణలు చెప్పిందని తెలిపారు. ఇంటర్నెట్‌ డెస్క్‌: నటి సిమ్రన్‌ (Simran) ఇటీవల ఓ


అవార్డు కార్యక్రమంలో చేసిన కామెంట్స్‌ చర్చనీయాంశంగా మారిన విషయం తెలిసిందే. తాను ఒక నటిని ప్రశంసిస్తూ సందేశం పంపానని.. ఆమె రిప్లై తనని ఎంతో బాధించిందని పేర్కొన్నారు. ఈ విషయాన్ని చెబుతూ..


పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమమని అన్నారు. అయితే సిమ్రన్‌ చేసిన ఈ వ్యాఖ్యలు ‘డబ్బా కార్టెల్‌’ సిరీస్‌లో నటిని ఉద్దేశించేనంటూ చాలామంది


కామెంట్స్‌ చేశారు. తాజాగా దీనిపై సిమ్రన్‌ స్పందించారు. ఈ విషయంపై ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సిమ్రన్‌.. ‘‘నేను డబ్బా కార్టెల్‌ సిరీస్‌ చూశాను. చాలా బాగుంటుంది. నేను చేసిన వ్యాఖ్యలను అందరూ


తప్పుగా అర్థం చేసుకున్నారు. నేను ఎవరిని ఉద్దేశించి కామెంట్‌ చేశానో.. వాళ్లకు ఆ సందేశం అందింది. ఆమె నాకు క్షమాపణలు చెప్పింది. నన్ను బాధించడం తన ఉద్దేశం కాదని చెప్పింది. ఈ విషయంలో ప్రజలు


అనవసరంగా ఎక్కువగా ఊహించుకున్నారు. నాకు ఎక్కువ మంది స్నేహితులు లేరు. ఎవరి గురించి గాసిప్‌లు మాట్లాడను. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా బహిరంగంగా చెబుతాను’’ అని సిమ్రన్‌ అన్నారు.  * జాన్వీని


విపరీతంగా ట్రోల్‌ చేశారు కానీ..: దర్శకుడు వ్యాఖ్యలు అసలేం జరిగిందంటే..  కొన్ని రోజుల క్రితం తనకు బాగా తెలిసిన తోటి నటికి సిమ్రన్‌ సందేశం పంపారు. ఆమె నటించిన ఓ సినిమాని ఉద్దేశించి అందులో


రాసుకొచ్చారు. ఆ సినిమాలో ఆమె పాత్ర చాలా బాగుందని.. ఆ రోల్‌ చూసి ఆశ్చర్యపోయానని మెసేజ్‌ పంపారు. దానికి ఆ నటి వెంటనే స్పందించింది. ‘ఆంటీ రోల్స్‌లో నటించడం కంటే ఇది ఎంతో ఉత్తమం అంటూ’ రిప్లై


ఇచ్చింది. దీనిపై సిమ్రన్‌ ఇటీవల ఓ అవార్డు కార్యక్రమంలో మాట్లాడారు. ‘‘నిజం చెప్పాలంటే ఆమె పంపిన మెసేజ్‌ నన్ను ఒకింత షాక్‌కు గురిచేసింది. ఆమె ఎంతో చులకనగా మాట్లాడినట్లు అనిపించింది. ఈ వేదికగా


ఆమెకు నేను చెప్పేది ఒక్కటే. పనికిమాలిన డబ్బా రోల్స్‌లో నటించడం కంటే ఆంటీ లేదా అమ్మ పాత్రలు పోషించడం ఎంతో ఉత్తమం. ఏ వర్క్‌ చేసినా ఆత్మస్థైర్యంతో ముందుకుసాగాలి. మనపై మనం నమ్మకం ఉన్నప్పుడే


వర్క్‌ కూడా అనుకున్నవిధంగా పూర్తి చేయగలుగుతాం. దేనినీ చులకనగా చూడకూడదు’’ అని ఆమె హితవు పలికారు.