
Kohli - anil kumble: కోహ్లీ స్థానంలో అతడిని ఇంగ్లాండ్కు పంపండి: అనిల్ కుంబ్లే
Play all audios:

త్వరలో టీమ్ఇండియా ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లనుంది. విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడంతో అతడి స్థానంలో ఎవరిని ఆడించాలనే దానిపై టీమ్ మేనేజ్మెంట్ దృష్టిసారించింది. ఇంటర్నెట్ డెస్క్:
కీలకమైన ఇంగ్లాండ్ పర్యటనకు ముందు రోహిత్ శర్మ (Rohit Sharma), విరాట్ కోహ్లీ టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించడం టీమ్ఇండియాకు గట్టి షాకే అని చెప్పాలి. వీరిద్దరూ తప్పుకోవడంతో టాప్ ఆర్డర్
బలహీనంగా మారింది. ఓపెనర్లుగా శుభ్మన్ గిల్, యశస్వి జైస్వాల్ బరిలోకి దిగడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే, సమస్యల్లా నాలుగో స్థానం గురించే. ఇన్నాళ్లు విరాట్ కోహ్లీ (Virat Kohli) నాలుగో స్థానంలో
ఆడేవాడు. ఇప్పుడు ఆ స్థానాన్ని ఎవరితో భర్తీ చేయాలనే దానిపై టీమ్ఇండియా (Team India) మేనేజ్మెంట్ దృష్టిపెట్టింది. ఈ నేపథ్యంలో భారత లెజండరీ స్పిన్నర్ అనిల్ కుంబ్లే (Anil Kumble) ఓ సలహా
ఇచ్చాడు. దేశవాళీ క్రికెట్లో అదరగొట్టి ఐపీఎల్లో ఆడుతున్న కరుణ్ నాయర్ (Karun Nair)ను ఇంగ్లాండ్ పర్యటనకు ఎంపిక చేసి నాలుగో స్థానంలో ఆడించాలని సూచించాడు. కరుణ్కు కౌంటీ క్రికెట్లో ఆడిన
అనుభవం కూడా ఉందని గుర్తు చేశాడు. ‘ఇటీవల దేశవాళీ క్రికెట్లో పరుగుల వరద పారించిన కరుణ్ నాయర్ తిరిగి భారత జట్టులోకి రావడానికి అర్హుడు. అతను నాలుగో స్థానంలో ఆడొచ్చు. ఎందుకంటే ఇప్పుడు భారత్కు
ఇంగ్లాండ్లో ఆడిన అనుభవం ఉన్న ఆటగాడు అవసరం. కరుణ్ నాయర్ కౌంటీ క్రికెట్ ఆడాడు. కాబట్టి అతనికి అక్కడి పరిస్థితులు తెలుసు. కరుణ్ 30 ఏళ్లు దాటి ఉండొచ్చు (33 ఏళ్లు). కానీ, అతను ఇంకా యంగ్గా
ఉన్నాడు. అతనికి అవకాశం లభిస్తే యువ ఆటగాళ్లకు ఫస్ట్క్లాస్ క్రికెట్ ఆడాలనే ఆసక్తి మరింత పెరుగుతుంది.దేశవాళీ క్రికెట్లో అద్భుత ప్రదర్శన చేసినా గుర్తింపు రాకపోతే అది కాస్త సవాలుగా మారుతుంది’
అని కుంబ్లే వివరించాడు. రంజీ ట్రోఫీ 2024-25లో విదర్భ ఛాంపియన్గా నిలవడంలో కరుణ్ నాయర్ కీలక పాత్ర పోషించాడు. ఈ టోర్నీలో అతను 16 ఇన్నింగ్స్లలో 53.93 సగటుతో 863 పరుగులు చేసి నాలుగో టాప్
స్కోరర్గా నిలిచాడు. ఇందులో నాలుగు సెంచరీలు, రెండు అర్ధసెంచరీలున్నాయి. 33 ఏళ్ల కరుణ్ ఇప్పటివరకు 6 టెస్టులు ఆడాడు. 2016లో స్వదేశంలో ఇంగ్లాండ్తో జరిగిన మ్యాచ్లో టెస్టుల్లోకి అరంగేట్రం
చేశాడు. తన మూడో టెస్టులోనే ట్రిపుల్ సెంచరీ చేసి అందర్నీ ఆశ్చర్యానికి గురిచేశాడు. చెన్నైలో ఇంగ్లాండ్పై 381 బంతుల్లోనే 303 పరుగులు చేశాడు. మార్చి, 2017లో చివరి టెస్టు ఆడాడు. ప్రస్తుతం
ఐపీఎల్లో దిల్లీ క్యాపిటల్స్కు ప్రాతినిధ్యం వహిస్తున్నాడు.