
Ipl 2025: భయమేసింది.. బాంబులు పడతాయని అరుపులు: ఛీర్లీడర్ వీడియో వైరల్
Play all audios:

IPL 2025: ఉగ్రస్థావరాలపై చేసిన దాడులను సహించలేని పాకిస్థాన్ భారత్ను లక్ష్యంగా చేసుకొని దాడులకు ఉపక్రమించింది. అయితే, వాటిని భారత సైన్యం తిప్పికొట్టి సరైన బుద్ధి చెప్పింది. ఇంటర్నెట్
డెస్క్: భారత్ - పాకిస్థాన్ దేశాల మధ్య ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. దీంతో ఐపీఎల్ 2025 సీజన్లో తొలిసారి మ్యాచ్ను మధ్యలోనే రద్దు చేసిన సంగతి తెలిసిందే. ధర్మశాల వేదికగా పంజాబ్ కింగ్స్,
దిల్లీ క్యాపిటల్స్ మధ్య మ్యాచ్ రద్దైంది. భద్రతా కారణాలతోనే ఆపేసినట్లు హిమాచల్ ప్రదేశ్ క్రికెట్ బోర్డు వెల్లడించింది. ఐపీఎల్ ఛైర్మన్ ధుమాల్ కూడా ప్రేక్షకులు త్వరగా వెళ్లిపోవాలని
విజ్ఞప్తి చేశాడు. జమ్మూకశ్మీర్, పఠాన్కోట్ ప్రాంతాల్లో పాక్ దాడులు చేసేందుకు ప్రయత్నించడంతో ధర్మశాలలో ముందస్తుగా ఆటను నిలిపేసినట్లు తెలుస్తోంది. దీంతో ఆటగాళ్లు, సపోర్ట్ సిబ్బంది, ఐపీఎల్
సభ్యులు, ప్రేక్షకులు మైదానాన్ని ఖాళీ చేసేశారు. ఈ క్రమంలో ఓ ఛీర్లీడర్ వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది. * పాక్ యుద్ధాన్ని ఎంచుకుంది.. ఎప్పటికీ మరిచిపోలేని సమాధానం ఇస్తాం: సెహ్వాగ్
‘‘స్టేడియం మొత్తం ఖాళీ అయిపోయింది. మ్యాచ్ మధ్యలోనే అందరినీ పంపించేశారు. ఇక్కడంతా భయంగా ఉంది. ప్రతిఒక్కరూ బాంబులు వస్తాయేమోనని అరుస్తూ వెళ్లిపోయారు. ధర్మశాలను వదిలి వెళ్లడం బాధగా ఉంది.
ఐపీఎల్ ప్రతినిధులు సరైన చర్యలు తీసుకున్నారు. అయితే, నేను ఎందుకు ఏడవడం లేదనేది తెలియడం లేదు. ఇప్పటికీ షాక్లోనే ఉన్నా’ అంటూ ఆమె చేసిన వ్యాఖ్యలతో వీడియో వైరల్గా మారింది. ఆటగాళ్ల కోసం
ప్రత్యేక రైలు ఏర్పాటు ధర్మశాల నుంచి ఆటగాళ్లను తరలించేందుకు బీసీసీఐ ప్రత్యేక రైలును ఏర్పాటుచేసింది. ధర్మశాలలో విమానాశ్రయాలను మూసివేసిన సంగతి తెలిసిందే. దీంతో దిల్లీకి తీసుకెళ్లేందుకు వందే
భారత్ రైలును బీసీసీఐ అధికారులు ఏర్పాటుచేశారు. దాడుల నేపథ్యంలో ఐపీఎల్ నిర్వహణపై ఛైర్మన్ అరుణ్ ధుమాల్ ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ధర్మశాలకు దగ్గరగా ఉండే ఉనా స్టేషన్ నుంచి రెండు
జట్ల ప్లేయర్లు, సపోర్ట్ స్టాఫ్, మ్యాచ్ అధికారులను తరలించనున్నట్లు క్రికెట్ వర్గాలు తెలిపాయి.