
Gt vs mi: ప్లేఆఫ్స్ మోస్ట్ రన్స్.. ఆరో బ్యాటర్గా సాయి సుదర్శన్.. ఎలిమినేటర్ మ్యాచ్ విశేషాలివీ
Play all audios:

ఐపీఎల్ 2025 సీజన్లో ఎలిమినేటర్ మ్యాచ్ ముగిసింది. ముంబయి విజేతగా నిలిచి రెండో క్వాలిఫయర్కు చేరుకుంది. రెండో క్వాలిఫయర్ మ్యాచ్లో ఆదివారం పంజాబ్ కింగ్స్తో ముంబయి తలపడనుంది. ఈ ఎలిమినేటర్
మ్యాచ్లో నమోదైన విశేషాలు తెలుసుకుందాం.. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ 2025 సీజన్ ఎలిమినేటర్ మ్యాచ్లో గుజరాత్ టైటాన్స్పై ముంబయి ఇండియన్స్ విజయం సాధించింది. ఈ ఎలిమినేటర్ మ్యాచ్లో ఇరు జట్లు
కలిపి 400+ పరుగులు చేయడం గమనార్హం. ఐపీఎల్ ప్లేఆఫ్స్ చరిత్రలో ఇదే అత్యధిక పరుగులు ఈ మ్యాచ్లోనే నమోదయ్యాయి. ఎలిమినేటర్కు సంబంధించి ఇలాంటి విశేషాలు మరికొన్ని మీ కోసం.. * ముంబయి ఇండియన్స్
ఐపీఎల్ ప్లేఆఫ్స్లో తొలుత బ్యాటింగ్ చేసినప్పుడు 10 మ్యాచుల్లో తొమ్మిదింట్లో విజయం సాధించింది. ఒక్కసారి మాత్రమే ఓడింది. ఇక రెండోసారి బ్యాటింగ్ చేసిన 11 మ్యాచుల్లో ఐదింట్లోనే గెలిచింది. ఆరు
మ్యాచుల్లో పరాజయం చవిచూసింది. * 2015 నుంచి ప్లేఆఫ్స్లో ముంబయి 12 మ్యాచులకుగాను 10 విజయాలు సాధించింది. నాకౌట్ స్టేజ్లో ముంబయి ఇండియన్స్ అత్యంత ప్రమాదకరమని చెప్పకనే అర్థమవుతోంది. *
ఐపీఎల్ ప్లేఆఫ్స్లో అత్యధిక పరుగులు నమోదైన మ్యాచ్ ఇదే. రెండు ఇన్నింగ్స్ల్లోనూ కలిపి 436 పరుగులు వచ్చాయి. ముంబయి 228 రన్స్ చేయగా.. గుజరాత్ 208 పరుగులు చేసింది. ఇప్పటి వరకు పంజాబ్ vs చెన్నై
మధ్య 2014లో జరిగిన క్వాలిఫయర్ 2లో నమోదైన 428 పరుగులే అత్యధికం. * ఐపీఎల్ సీజన్లో 750+ పరుగులు చేసిన ఆరో బ్యాటర్గా సాయి సుదర్శన్ నిలిచాడు. ప్రస్తుత ఎడిషన్లో సాయి 759 పరుగులు చేశాడు. అతడే
టాప్ స్కోరర్గా కొనసాగుతున్నాడు. 2016లో విరాట్ కోహ్లీ (973), 2023లో శుభ్మన్ గిల్ (890), 2022లో జాస్ బట్లర్ (863), 2016లో డేవిడ్ వార్నర్ (848) భారీగా పరుగులు రాబట్టారు. * ప్రస్తుత సీజన్లో
రోహిత్ శర్మ నాలుగు హాఫ్ సెంచరీలు చేశాడు. ఆ మ్యాచ్లన్నిటినిలోనూ ముంబయి విజయం సాధించడం గమనార్హం. తాజాగా ఎలిమినేటర్ మ్యాచ్లోనూ రోహిత్ 81 పరుగులు చేసి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలిచాడు.
నాలుగు సిక్స్లు బాదిన అతడు.. ఐపీఎల్లో 300+ సిక్స్లు కొట్టిన తొలి భారత క్రికెటర్గా ఘనత సాధించాడు. ఐపీఎల్లో 7వేల మైలురాయిని అందుకొన్నాడు.