
Ajinkya rahane: రూ. 20 కోట్లు ఇస్తే రెట్టింపు కష్టపడాలని కాదు: రహానె కీలక వ్యాఖ్యలు
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: కోల్కతా నైట్రైడర్స్లో ఖరీదైన ఆటగాడు, వైస్ కెప్టెన్ వెంకటేశ్ అయ్యర్ (Venkatesh Iyer) ఈ సీజన్లో పేలవ ప్రదర్శనతో విఫలమయ్యాడు. దీంతో అతడిపై విమర్శలు వస్తున్నాయి.
దీనిపై ఆ జట్టు సారథి అజింక్య రహానె (Ajinkya Rahane) స్పందించాడు. ఐపీఎల్ (IPL 2025)లో ఆటగాడి ప్రదర్శనపై ధర ఎలాంటి ప్రభావం చూపదంటూ అయ్యర్కు మద్దతుగా నిలిచాడు. రూ.20కోట్లకు పైగా ఇచ్చినంత
మాత్రాన.. అతడు రెట్టింపు కష్టపడాలని కాదన్నాడు. ‘‘రూ.20 కోట్లు అంతకంటే ఎక్కువ అందుకుంటున్నామని ఎవరూ రెట్టింపు కష్టపడి పనిచేయరు. అలాగే.. రూ.కోటి, రూ.2కోట్లు, రూ.3కోట్లు మాత్రమే
తీసుకుంటున్నామని ఎవరూ మ్యాచ్ను తేలిగ్గా తీసుకోరు. మైదానంలోకి వచ్చిన తర్వాత ఆటగాళ్ల ప్రవర్తనలో ఎలాంటి తేడా ఉండదు. అదే ఇక్కడ చాలా ముఖ్యం. ఒక ఆటగాడిపై మన నియంత్రణలో ఉన్న అంశాలపై మాత్రమే
దృష్టిపెడతాం. వెంకటేశ్ అయ్యర్ కూడా అలాగే ఫోకస్ చేశాడు. అతడి ప్రవర్తన అద్భుతం. పేలవ ప్రదర్శన అనేది ఏ ఆటగాడికైనా ఎప్పుడో ఒక సందర్భంలో ఎదురయ్యేదే. అంతేగానీ.. ప్రైస్ ట్యాగ్ దీనికి కారణం
కాదు. ప్రైస్ ట్యాగ్ గురించి అతడు ఆలోచిస్తాడని నేను అనుకోను’’ అని రహానె తెలిపాడు. * కెప్టెన్గా నీ ప్రవర్తనే ఇప్పుడు చాలా ముఖ్యం: గిల్కు గావస్కర్ సూచన గతేడాది ఐపీఎల్ ట్రోఫీ నెగ్గిన
కోల్కతా (KKR).. ఈ సీజన్లో ఆకట్టుకోలేకపోయింది. మెగా వేలంలో రూ.23.75 కోట్లు వెచ్చించి మరీ ఈ జట్టు సొంతం చేసుకున్న వెంకటేశ్ అయ్యర్.. తన స్థాయి ప్రదర్శన చేయలేకపోయాడు. కేవలం 20.28 సగటుతో
కేవలం 142 పరుగులు మాత్రమే చేశాడు. ఇక, గతేడాది జట్టు విజయంలో కీలక పాత్ర పోషించిన రింకూ సింగ్, రసేల్, రమన్దీప్ కూడా ఈ సారి రాణించలేకపోయారు. దీనిపై కూడా రహానె స్పందించాడు. ‘‘ఛాంపియన్షప్ను
గెలవడం, దాన్ని నిలబెట్టుకోవడం అనేది అంత తేలికైన విషయం కాదు. జట్టుతో మేం ఉత్తమ ప్రదర్శన ఇచ్చేందుకు ప్రయత్నించాం. కానీ కొన్ని సార్లు వైఫల్యాలు తప్పలేదు. వచ్చే సీజన్కు బలంగా తిరిగొస్తాం’’ అని
రహానె ఆశాభావం వ్యక్తం చేశాడు.