
Rohit sharma: ఉద్వేగానికి గురైన రోహిత్ శర్మ కుటుంబ సభ్యులు
Play all audios:

ముంబయిలోని వాంఖడే స్టేడియంలో రోహిత్ శర్మ స్టాండ్ ఆవిష్కరణ శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హిట్మ్యాన్ కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురయ్యారు. ఇంటర్నెట్ డెస్క్: ముంబయిలోని వాంఖడే
స్టేడియంలో రోహిత్ శర్మ (Rohit Sharma) స్టాండ్ ఆవిష్కరణ ముంబయి క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శుక్రవారం జరిగింది. ఈ సందర్భంగా హిట్మ్యాన్ కుటుంబ సభ్యులు ఉద్వేగానికి గురయ్యారు. తడి నిండిన
కళ్లతో కనిపించారు. రోహిత్ శర్మ సైతం వేదిక మీద మాట్లాడేటప్పుడు కొన్ని క్షణాలపాటు నీళ్లు నిండిన కళ్లతో కనిపించాడు. తన తల్లిందండ్రులు, భార్య, సోదరుడికి కృతజ్ఞతలు తెలిపాడు. ‘ఈ రోజు ఇక్కడ నా
కుటుంబమైన తల్లిదండ్రులు, భార్య, సోదరుడు ఉండటం నాకు మరింత ప్రత్యేకంగా ఉంది. వారు నా కోసం చేసిన త్యాగాలకు నా కృతజ్ఞతలు. ఈరోజు జరుగుతున్న దాన్ని నేను ఎప్పుడూ ఊహించలేదు. చిన్నప్పుడు నేను ముంబయి,
టీమ్ఇండియా (Team India) తరఫున ఆడాలని కలలు కన్నాను. నేడు గొప్ప క్రికెటర్ల జాబితాలో నా పేరు ఉందంటే ఆ ఆనందం మాటల్లో చెప్పలేను. నేను ఇంకా ఆడుతుండటం నాకు మరింత ప్రత్యేకంగా ఉంది. రెండు ఫార్మాట్ల
నుంచి మాత్రమే రిటైర్ అయ్యాను. ఇంకా ఒక ఫార్మాట్లో ఆడుతున్నాను. వాంఖడే ఒక అద్భుతమైన స్టేడియం. నాకు దీంతో ఎంతో అనుబంధం ఉంది’ అని రోహిత్ శర్మ అన్నాడు. భారత మాజీ కెప్టెన్ అజిత్ వాడేకర్,
బీసీసీఐ (BCCI) మాజీ అధ్యక్షుడు శరద్ పవార్కు హిట్మ్యాన్ కృతజ్ఞతలు తెలిపాడు. అనంతరం మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్తో కలిసి రోహిత్ శర్మ స్టాండ్ను హిట్మ్యాన్ తల్లిదండ్రులు
ఆవిష్కరించారు.