Cm revanth reddy: త్వరలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు ఏర్పాటు: సీఎం రేవంత్‌రెడ్డి

Cm revanth reddy: త్వరలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు ఏర్పాటు: సీఎం రేవంత్‌రెడ్డి

Play all audios:


తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. హైదరాబాద్‌: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో


ఆర్థికశాస్త్ర నిపుణుడు, నోబెల్‌ అవార్డు గ్రహీత అభిజిత్‌ బెనర్జీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా సీఎం మాట్లాడుతూ.. త్వరలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌ బోర్డు ఏర్పాటు చేయనున్నట్టు


చెప్పారు. ఈ బోర్డులో భాగస్వామ్యం కావాలని అభిజిత్‌ బెనర్జీని కోరగా.. అందుకు ఆయన అంగీకరించారు. ఫ్యూచ‌ర్ సిటిలో ఆర్ట్స్ అండ్  క్రాఫ్ట్స్, సృజనాత్మకతను భాగం చేయాల‌ని అభిజిత్ బెనర్జీ సూచించారు.


సంప్రదాయ చేతివృత్తుల వారిని ఆధునిక వ్యాపారవేత్తలుగా మార్చేందుకు ప్రత్యేక స్వల్పకాలిక కోర్సులు నిర్వహించాలని సలహా ఇచ్చారు.