Usa: చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం: అమెరికా

Usa: చైనా విద్యార్థుల వీసాల రద్దే లక్ష్యంగా ముందుకెళ్తాం: అమెరికా

Play all audios:


ఇంటర్నెట్‌డస్క్‌: విదేశీ విద్యార్థుల విషయంలో అమెరికా (USA) ఇప్పటికే పలు సంచలన ప్రకటనలు చేస్తూ వచ్చింది. ఈక్రమంలో యూఎస్‌ విదేశాంగ కార్యదర్శి మార్కో రూబియో (Marco Rubio) చైనా విద్యార్థుల


వీసాలకు సంబంధించిన విషయాన్ని పంచుకున్నారు. బీజింగ్‌ విద్యార్థుల వీసాలను రద్దు చేయడమే లక్ష్యంగా తమ ప్రభుత్వం సిద్ధమవుతున్నట్లు తెలిపారు.  చైనా (China) విద్యార్థుల వీసాలను రద్దు చేయడానికి


అమెరికా ప్రభుత్వం సన్నద్ధమవుతుందని రూబియో తెలిపారు. ముఖ్యంగా పరిశోధనా రంగాల్లో చదువుకుంటున్న వారితో పాటు, చైనీస్‌ కమ్యూనిస్ట్‌ పార్టీతో సంబంధాలు ఉన్న విద్యార్థుల వీసాలే లక్ష్యంగా ఉన్నట్లు


తెలిపారు. ఈ ప్రకటనపై వాషింగ్టన్‌లోని చైనా రాయబార కార్యాలయం ఇప్పటివరకు స్పందించలేదు. అమెరికాలోని విశ్వవిద్యాలయాలకు చైనాతో సంబంధాలు తెంచుకోవాలనే ఒత్తిడి ఇటీవల పెరిగింది. హౌస్‌ రిపబ్లికన్లు


డ్యూక్‌ యూనివర్సిటీకి ఈమేరకు పిలుపునిచ్చారు. అమెరికా నిధులతో నిర్వహిస్తున్న అధ్యయనాలను చైనా విద్యార్థులు తెలుసుకుంటున్నారని వారు ఆరోపించారు. ఈనేపథ్యంలోనే రూబియో ప్రకటన వెలువడింది. అమెరికాలో


చదువుతున్న విదేశీ విద్యార్థుల్లో భారత్‌ తర్వాత స్థానం చైనాదే. 2023-24 విద్యా సంవత్సరంలో 2,70,000 మంది చైనా విద్యార్థులు చదువుకున్నారు. ఇది అక్కడి మొత్తం విదేశీ విద్యార్థుల్లో నాలుగో వంతు. *


అమెరికా కీలక నిర్ణయం.. యూఎస్‌ పౌరుల పోస్టులను సెన్సార్‌ చేసేవారికి వీసా నిషేధం విదేశీ విద్యార్థులపై ట్రంప్‌ (Donald Trump) సర్కారు కన్నెర్ర చేస్తోంది. పాలస్తీనా అనుకూల ఆందోళనల్లో పాల్గొన్న


వారి దగ్గర్నుంచి.. చిన్న చిన్న ట్రాఫిక్‌ ఉల్లంఘనలకు పాల్పడిన వారి వీసాలను కూడా రద్దు చేస్తూ స్వదేశాలకు పంపించేస్తున్నారు. ఇటీవల హార్వర్డ్‌ యూనివర్సిటీలో విదేశీ విద్యార్థులు తీసుకొనే అనుమతిని


కూడా రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. అయితే, దీనికి ఫెడరల్‌ కోర్టులో చుక్కెదురైంది.  మరోవైపు.. ప్రపంచవ్యాప్తంగా ఉన్న అమెరికా రాయబార కార్యాలయాల్లో కొత్తగా దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వీసా


ఇంటర్వ్యూల షెడ్యులింగ్‌ను తాత్కాలికంగా నిలిపేస్తున్నట్లు మంగళవారం ప్రకటించింది. యూఎస్‌ సోషల్‌ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో అమెరికన్లు చేసే పోస్టులను, కామెంట్లను సెన్సార్‌ చేయడానికి ప్రయత్నించే


విదేశీ అధికారులపై కొత్తగా వీసా నిషేధాన్ని ప్రకటించింది. అంతేకాకుండా తమ దేశానికి చెందిన సామాజిక మాధ్యమాలకు కంటెంట్‌ను తీసేయమని నోటీసులు పంపడం, ఒత్తిడికి గురిచేసిన వారి పైనా ఈ వీసా నిషేధం


అమలుకానున్నట్లు అమెరికా పేర్కొంది.