Samsung galaxy m32 5g: సాంసంగ్ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఇవే

Samsung galaxy m32 5g: సాంసంగ్ నుంచి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు ఇవే

Play all audios:


Published by: Last Updated:August 25, 2021 2:50 PM IST SAMSUNG GALAXY M32 5G | ఇండియన్ మార్కెట్‌లో కంపెనీలు పోటాపోటీగా 5జీ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తున్నాయి. లేటెస్ట్‌గా SAMSUNG GALAXY


M32 5G స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయింది. రూ.20,000 బడ్జెట్‌లో Samsung Galaxy M32 5G స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. ఈ బడ్జెట్ సెగ్మెంట్‌లో ఇప్పటికే Realme Narzo 30 Pro, Samsung Galaxy A22 5G,


Realme X7, Oppo A74, iQoo Z3, Realme 8 5G స్మార్ట్‌ఫోన్లు ఉన్నాయి. ఇప్పటికే మార్కెట్‌లో సాంసంగ్ గెలాక్సీ ఎం32 స్మార్ట్‌ఫోన్ ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు ఇదే వర్షన్‌లో 5జీ మొబైల్‌ను (5G


Smartphone) పరిచయం చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ ధర రూ.20,999. ఇది 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర. దీంతో పాటు 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్


కూడా రిలీజ్ అయింది. కానీ ధర ఇంకా వెల్లడించలేదు కంపెనీ. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ సెప్టెంబర్ 2న మొదలవుతుంది. సాంసంగ్ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు అమెజాన్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ కొనొచ్చు. ఐసీఐసీఐ బ్యాంక్


క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.2,000 ఇన్‌స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది. సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6 జీబీ+128 జీబీ, 8 జీబీ + 128 జీబీ


వేరియంట్లలో రిలీజ్ అయింది. మైక్రో ఎస్‌డీ కార్డుతో 1టీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్ పెంచుకోవచ్చు. 6.5 అంగుళాల హెచ్‌డీ+ డిస్‌ప్లే ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 720 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది.


సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 48 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్ + 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌తో క్వాడ్


కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీల కోసం వాటర్ డ్రాప్ స్టైల్ నాచ్‌తో 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది. ఈ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 15వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంది.


advertisement సాంసంగ్ గెలాక్సీ ఎం32 5జీ స్మార్ట్‌ఫోన్ కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ ఎల్‌టీఈ, వైఫై, బ్లూటూత్, జీపీఎస్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ 12 5జీ బ్యాండ్స్‌ని సపోర్ట్


చేస్తుంది. ఆండ్రాయిడ్ 11 + వన్ యూఐ 3.1 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. రెండేళ్ల వరకు ఓఎస్ సపోర్ట్ ఉంటుందని సాంసంగ్ ప్రకటించింది. ఇక ఫింగర్‌ప్రింట్ సెన్సార్ పవర్ బటన్‌కు ఇంటిగ్రేట్ అయి


ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్‌ను స్లేట్ బ్లాక్, స్కై బ్లూ కలర్స్‌లో కొనొచ్చు. advertisement రియల్‌మీ, షావోమీ, సాంసంగ్, వివో, ఒప్పో లాంటి కంపెనీలన్నీ ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌లోకి వరుసగా 5జీ


మోడల్స్ రిలీజ్ చేస్తున్నాయి. ఇండియాలో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి రాలేదు. త్వరలోనే ఇండియాలో 5జీ నెట్వర్క్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. అందుకే కంపెనీలు 5జీ స్మార్ట్‌ఫోన్లు విడుదల


చేస్తున్నాయి. ఇండియాలో 5జీ నెట్వర్క్ వచ్చిన తర్వాత స్మార్ట్‌ఫోన్ మార్చాల్సిన అవసరం లేకుండా హైస్పీడ్ నెట్వర్క్ వాడుకోవడానికి 5జీ స్మార్ట్‌ఫోన్లు ఉపయోగపడతాయి. Location : First Published :


August 25, 2021 2:50 PM IST Read More