
Konda surekha: కొండా సురేఖతో గేమ్ ప్లాన్ ఆడిస్తున్నారా? ఇది సీఎం రేవంత్ రెడ్డి వ్యూహమా?
Play all audios:

Published by: Last Updated:October 03, 2024 5:01 PM IST KONDA SUREKHA: తెలంగాణలో ఇప్పుడో అనవసర వివాదం నడుస్తోంది. అభివృద్ధి, ప్రజా సమస్యలు గాలికి పోగా.. పనికిమాలిన అంశాలు తెరపైకి వచ్చి,
దుమారం రేపుతున్నాయి. కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి ప్రజలు కోరుకుంటున్నది ఇది అస్సలు కాదనే అనుకోవాలి. తెల్లారితే తెలంగాణలో బోలెడు సమస్యలు. రైతులు, విద్యార్థులు, నిరుద్యోగులు, మహిళలు.. ఇలా ప్రతి
ఒక్కరికీ సమస్యలున్నాయి. సమస్యలు లేని వారిని ఒక్కరిని కూడా ప్రభుత్వం చూపించే పరిస్థితే లేదు. వీటికి తోడు హైడ్రా సమస్య మరింత పెద్దగా మారింది. సామాన్యులు హైడ్రా పేరు వింటేనే భయపడే పరిణామాలు
వచ్చేశాయి. ఇలాంటి సమయంలో.. ఏ సమస్యలూ లేనట్లుగా అటవీ, పర్యావరణ, ఎండోమెంట్స్ మంత్రి కొండా సురేఖ.. కేటీఆర్, ఓ ప్రముఖ నటిపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసి.. రచ్చ రచ్చ చేశారు. దీనిపై టాలీవుడ్
భగ్గుమంటోంది. ఎవర్ని అంటే ఎవరు ఊరుకుంటారు? ఈ స్థాయి రెస్పాన్స్ రావడంలో ఆశ్చర్యం ఏమాత్రం లేదు.అసలు రాజకీయ నాయకులు ఇష్టమొచ్చినట్లు ఎందుకు మాట్లాడాలి? ఆధారాలు లేకుండా ఎడా పెడా మాట్లాడేస్తే
ఊరుకోవాలా? మంత్రి స్థాయిలో ఉన్నవారు ఎంత హుందాగా వ్యవహరించాలి? ఏది బడితే అది మాట్లాడేసి.. ఎదుటివారిపై దుమ్మెత్తి పోస్తే సరిపోతుందా? తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఏంటి? సమయం చాలా విలువైనది.
బంగారు తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. హామీల అమలు కోరుకుంటున్నారు. రకరకాల సమస్యలకు పరిష్కారాలు కోరుకుంటున్నారు. మంత్రులు తమ శాఖలతో
మంచి పనులు చెయ్యాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ వదిలేసి.. వివాదాస్పద వ్యాఖ్యలతో పొద్దు పుచ్చితే.. ఇదేం పాలన? అనే ప్రశ్నలొస్తున్నాయి.ఇంత జరిగినా.. కొండ సురేఖ మళ్లీ ఏస్సారు. బీఆర్ఎస్ ప్రభుత్వం
పడిపోవడానికి కేటీఆరే కారణం అన్నారు. కేటీఆర్ పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నారనీ, వేల కోట్ల రూపాయల స్కామ్ చేశారని ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి కేటీఆరే కారణం అన్నారు.
నిన్నటి నుంచి ఆమె వ్యాఖ్యలపై ఇంత రచ్చ జరుగుతున్నా.. అవేవీ పట్టనట్లు.. మళ్లీ ఆమె ఇలా కేటీఆర్ని టార్గెట్ చేశారంటే.. ఏమనుకోవాలి? ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ఆడిస్తున్న గేమ్ ప్లాన్ అనే టాక్
వినిపిస్తోంది. తెరవెనక ఆయనే ఉండి.. కేటీఆర్ని టార్గెట్ చేయిస్తున్నారనే వాదన తెరపైకి వస్తోంది.హైడ్రా విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్యులు హైడ్రాపై
మండిపడుతున్నారు. స్వయంగా హైకోర్టే హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి తోడు గ్యారెంటీ పథకాల అమలు కూడా సరిగా లేదు. రుణమాఫీ అవ్వక రైతులు లబోదిబో మంటున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఎక్కడ అని
ప్రశ్నిస్తున్నారు. మహిళలు నెల నెలా ఇవ్వాల్సిన రూ.2,500 ఏవి అంటున్నారు? రైతు భరోసా ఇంకా మొదలవ్వలేదు. ఇలా ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది. ఈ పరిస్థితుల్లో.. వస్తున్న
డ్యామేజీకి బ్రేక్ వేసేందుకు.. సినీ నటి అంశాన్ని లేవనెత్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయించడం ద్వారా డైవర్షన్ పాలిటిక్స్కి తెరలేపారనే వాదన వినిపిస్తోంది. అసలు రాజకీయ నాయకులు ఇష్టమొచ్చినట్లు
ఎందుకు మాట్లాడాలి? ఆధారాలు లేకుండా ఎడా పెడా మాట్లాడేస్తే ఊరుకోవాలా? మంత్రి స్థాయిలో ఉన్నవారు ఎంత హుందాగా వ్యవహరించాలి? ఏది బడితే అది మాట్లాడేసి.. ఎదుటివారిపై దుమ్మెత్తి పోస్తే సరిపోతుందా?
తెలంగాణ ప్రజలు కోరుకుంటున్నది ఏంటి? సమయం చాలా విలువైనది. బంగారు తెలంగాణను ప్రజలు కోరుకుంటున్నారు. అభివృద్ధి, ఉద్యోగాలు, ఉపాధి అవకాశాలు కోరుకుంటున్నారు. హామీల అమలు కోరుకుంటున్నారు. రకరకాల
సమస్యలకు పరిష్కారాలు కోరుకుంటున్నారు. మంత్రులు తమ శాఖలతో మంచి పనులు చెయ్యాలని కోరుకుంటున్నారు. ఇవన్నీ వదిలేసి.. వివాదాస్పద వ్యాఖ్యలతో పొద్దు పుచ్చితే.. ఇదేం పాలన? అనే ప్రశ్నలొస్తున్నాయి.
advertisement ఇంత జరిగినా.. కొండ సురేఖ మళ్లీ ఏస్సారు. బీఆర్ఎస్ ప్రభుత్వం పడిపోవడానికి కేటీఆరే కారణం అన్నారు. కేటీఆర్ పనికిమాలిన నిర్ణయాలు తీసుకున్నారనీ, వేల కోట్ల రూపాయల స్కామ్ చేశారని
ఆరోపించారు. బీఆర్ఎస్ ప్రభుత్వం అధికారం కోల్పోవడానికి కేటీఆరే కారణం అన్నారు. నిన్నటి నుంచి ఆమె వ్యాఖ్యలపై ఇంత రచ్చ జరుగుతున్నా.. అవేవీ పట్టనట్లు.. మళ్లీ ఆమె ఇలా కేటీఆర్ని టార్గెట్ చేశారంటే..
ఏమనుకోవాలి? ఇదంతా సీఎం రేవంత్ రెడ్డి ఆడిస్తున్న గేమ్ ప్లాన్ అనే టాక్ వినిపిస్తోంది. తెరవెనక ఆయనే ఉండి.. కేటీఆర్ని టార్గెట్ చేయిస్తున్నారనే వాదన తెరపైకి వస్తోంది. advertisement హైడ్రా
విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వానికి కొంత వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సామాన్యులు హైడ్రాపై మండిపడుతున్నారు. స్వయంగా హైకోర్టే హైడ్రాపై ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనికి తోడు గ్యారెంటీ పథకాల అమలు కూడా
సరిగా లేదు. రుణమాఫీ అవ్వక రైతులు లబోదిబో మంటున్నారు. నిరుద్యోగులు ఉద్యోగాలు ఎక్కడ అని ప్రశ్నిస్తున్నారు. మహిళలు నెల నెలా ఇవ్వాల్సిన రూ.2,500 ఏవి అంటున్నారు? రైతు భరోసా ఇంకా మొదలవ్వలేదు. ఇలా
ప్రభుత్వంపై అన్ని వర్గాల నుంచి విపరీతమైన ఒత్తిడి ఉంది. ఈ పరిస్థితుల్లో.. వస్తున్న డ్యామేజీకి బ్రేక్ వేసేందుకు.. సినీ నటి అంశాన్ని లేవనెత్తి వివాదాస్పద వ్యాఖ్యలు చేయించడం ద్వారా డైవర్షన్
పాలిటిక్స్కి తెరలేపారనే వాదన వినిపిస్తోంది. advertisement ఒకవేళ ఇవి డైవర్షన్ పాలిటిక్సే అయితే.. ప్రజలు మాత్రం వీటిని సహించరు. వారు కోరుకుంటున్నది ఇది కాదు. సినీ నటిని వివాదాల్లోకి లాగడం
అత్యంత దారుణ అంశంగా తెలుగు రాష్ట్రాల ప్రజలు భావిస్తున్నారు. రాజకీయాలు మరీ ఇంత దారుణంగా పతనమైపోతే ఎలా అని ప్రశ్నిస్తున్నారు. మంత్రి కొండా సురేఖ బహిరంగ క్షమాపణలు చెప్పాలనే డిమాండ్స్
వినిపిస్తున్నాయి. ఒక మహిళ అయి ఉండి, మరో మహిళపై ఇలాంటి వ్యాఖ్యలు చేయడమేంటని ప్రజలు ఆగ్రహంతో రగులుతున్నారు. పాలకులు పాలిస్తే, ప్రజలు హర్షిస్తారు. పరిహసిస్తే, ప్రకోపం చూపిస్తారు. పరిణామాలు,
ప్రతికూలంగా మారకముందే మేలుకుంటే మంచిదే! Location : Hyderabad,Telangana First Published : October 03, 2024 4:29 PM IST Read More