
Chandrababu: కుప్పంలో ప్రసన్న తిరుపతి గంగమ్మకు సారె సమర్పించిన చంద్రబాబు దంపతులు
Play all audios:

ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) కుప్పంలో పర్యటిస్తున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. కుప్పం పట్టణం: ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu)
కుప్పంలో పర్యటిస్తున్నారు. సతీమణి నారా భువనేశ్వరితో కలిసి ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరలో ఆయన పాల్గొన్నారు. సీఎం దంపతులకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం వారు అమ్మవారి
విశ్వరూప దర్శనం చేసుకున్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు దంపతులు సారె సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. రాష్ట్రానికి మంచి జరగాలని సీఎం ప్రార్థించారు. మరోవైపు అమ్మవారి విశ్వరూప దర్శనం కోసం
భక్తులు భారీగా తరలివచ్చారు. ఏడాదికి ఒకసారి మాత్రమే ఈ దర్శనం కల్పిస్తారు.