
Pm modi: ప్రధాని నివాసంలో సీడీఎస్, త్రివిధ దళాల అధిపతుల భేటీ
Play all audios:

(పాతచిత్రం) ఇంటర్నెట్ డెస్క్: ప్రధాని నరేంద్ర మోదీ (PM Narendra Modi) సోమవారం త్రివిధ దళాధిపతులతో ఉన్నతస్థాయి సమావేశం నిర్వహించారు. ప్రధాని నివాసంలో ప్రస్తుతం ఈ సమావేశం కొనసాగుతోంది.
ఇందులో త్రివిధ దళాధిపతులు, చీఫ్ ఆఫ్ డిఫెన్స్ స్టాఫ్ అనిల్ చౌహాన్, జాతీయ భద్రతా సలహాదారు అజిత్ డోభాల్, రక్షణశాఖ మంత్రి రాజ్నాథ్ సింగ్, పలువురు సైనిక అధికారులు ఈ భేటీలో
పాల్గొన్నారు. భారత్-పాక్లు పరస్పర చర్చల తర్వాత కాల్పుల విరమణ ప్రకటించడం.. ఆ తర్వాత దానిని ఇస్లామాబాద్ ఉల్లంఘించడం మొదలైన విషయాల్లో హాట్లైన్లో నేడు భారత్-పాక్ మధ్య కీలక చర్చలు జరగనున్న
నేపథ్యంలో ఈ సమావేశం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలిటరీ ఆపరేషన్స్(DGMO)లో పాల్గొననున్నారు. తాజా పరిస్థితులపై మరికొద్దిసేపట్లో విదేశాంగ శాఖ, రక్షణశాఖ
ప్రెస్ బ్రీఫింగ్ చేయనుంది. తాత్కాలిక కాల్పుల విరమణకు అంగీకరించిన కొన్ని గంటల్లోనే పాక్ మళ్లీ దాడులకు తెగబడటం.. అనంతర పరిణామాలపై త్రివిధ దళాలతో ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు సమీక్షలు
నిర్వహిస్తున్నారు. * కాల్పుల మోత లేదు.. 19 రోజుల తర్వాత నియంత్రణ రేఖ వెంబడి ప్రశాంతత ఇరుదేశాల డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ (DGMO) స్థాయిలో నేడు చర్చలు జరగనున్న నేపథ్యంలో
ఆదివారం మోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. పాకిస్థాన్ బుల్లెట్లకు ఫిరంగులతో సమాధానం ఇవ్వాలని భారత సైన్యాన్ని ఆదేశించారు. పాకిస్థాన్ చర్యలకు భారత్ నుంచి బలమైన ప్రతిస్పందన ఉండాలని సాయుధ దళాలకు
సూచించారు. కశ్మీర్ విషయంలో భారత్కు చాలా స్పష్టమైన వైఖరి ఉందని మోదీ వెల్లడించినట్లు ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. పాకిస్థాన్ ఆక్రమిత కశ్మీర్ను భారత్కు అప్పగించడం మినహా కశ్మీర్ అంశంలో పాక్తో
ఎలాంటి చర్చలు ఉండవని వెల్లడించాయి. కశ్మీర్ అంశంలో ఎవరి మధ్యవర్తిత్వమూ అవసరం లేదని తేల్చి చెప్పాయి. ప్రస్తుతం భారత్-పాకిస్థాన్ సరిహద్దుల్లోని నియంత్రణ రేఖ (LOC) వెంబడి ప్రశాంత వాతావరణం
నెలకొంది.