
Chandrababu: సంపద సృష్టించాలి.. ప్రజలకు అందించాలి: ఏపీ సీఎం చంద్రబాబు
Play all audios:

విజయవాడ: ప్రపంచంలో యువత ఎక్కువగా ఉండేది భారత్లోనే అని ఏపీ సీఎం చంద్రబాబు (Chandrababu) అన్నారు. ఆర్థిక సంస్కరణలతో ప్రభుత్వ, ప్రైవేట్ భాగస్వామ్యం వచ్చిందని చెప్పారు. అప్పుడప్పుడే వస్తున్న
ఐటీని సద్వినియోగం చేసుకున్నామన్నారు. విజయవాడలో పశు సంవర్ధకశాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన టెక్ ఏఐ కాంక్లేవ్కు సీఎం ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. ‘‘ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో ఏ పనైనా
సులువుగా చేసుకునే పరిస్థితి వచ్చింది. గతంలో ఎక్కడ చూసినా రహదారులు గుంతలతో కనిపించేవి. ప్రభుత్వ, ప్రైవేటు భాగస్వామ్యంతో రోడ్లను చక్కగా నిర్మించారు. ఇప్పుడు ఎక్కడ చూసినా జాతీయ రహదారుల
అభివృద్ధి జరుగుతోంది. సంపద సృష్టించాలి.. ప్రజలకు అందించాలి. పేదరికం లేని సమాజమే లక్ష్యంగా పెట్టుకున్నాం. రైతుల ఆదాయం రెట్టింపు చేస్తున్నాం. నేను ఎప్పుడూ విద్యార్థిగానే ఉంటా.. అనునిత్యం కొత్త
విషయాలు తెలుసుకుంటా. సాంకేతికత ప్రతి ఒక్కరికీ అందుబాటులో ఉంది. సాంకేతిక యుగంలో సమర్థత పెంచుకోవాలి. ప్రపంచంలో ఎక్కడికి వెళ్లినా భారతీయులు ఉన్నారు.. అందులో తెలుగువాళ్లే అధికం. నా ఆలోచన ఒకటే.
మనం బాగుంటేనే చాలదు.. తిరిగి సమాజానికి ఇవ్వాలి’’ అని చంద్రబాబు అన్నారు.