Omc case: ఓఎంసీ కేసు.. ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంలో చుక్కెదురు

Omc case: ఓఎంసీ కేసు.. ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంలో చుక్కెదురు

Play all audios:


ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారిణి శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పులను సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా పక్కన పెట్టింది. దిల్లీ: ఓఎంసీ కేసులో ఐఏఎస్‌ అధికారిణి


శ్రీలక్ష్మికి సుప్రీంకోర్టులో చుక్కెదురైంది. హైకోర్టు తీర్పును సర్వోన్నత న్యాయస్థానం పూర్తిగా పక్కన పెట్టింది. 3 నెలల్లో మరోసారి విచారణ జరపాలని ఆదేశించింది. హైకోర్టు తీర్పుతో సంబంధం లేకుండా


మరోసారి విచారణ చేపట్టాలని స్పష్టం చేసింది. 2022లో హైకోర్టు శ్రీలక్ష్మిని ఈ కేసు నుంచి డిశ్చార్జ్‌ చేసిన విషయం తెలిసిందే. ఆ డిశ్చార్జ్‌ పిటిషన్‌పై హైకోర్టు నిర్ణయాన్ని తాజాగా సుప్రీంకోర్టు


తోసిపుచ్చింది. (Supreme Court) ఓబుళాపురం అక్రమ మైనింగ్‌ కేసులో నిందితులకు మంగళవారం హైదరాబాద్‌లోని సీబీఐ కోర్టు శిక్ష విధించిన విషయం తెలిసిందే. ప్రధాన నిందితులైన గాలి జనార్దనరెడ్డితో పాటు


బి.వి.శ్రీనివాసరెడ్డి, వి.డి.రాజగోపాల్, మెఫజ్‌ అలీఖాన్‌లకు ఒక్కొక్కరికి కోర్టు ఏడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేల చొప్పున జరిమానా విధించింది. ప్రభుత్వ ఉద్యోగి అయిన రాజగోపాల్‌కు అదనంగా 4 ఏళ్ల జైలు


శిక్ష, రూ.2 వేల జరిమానా విధించారు. నిందితులు జరిమానా చెల్లించని పక్షంలో అదనంగా ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాలని పేర్కొన్నారు. ఓబుళాపురం మైనింగ్‌ కార్పొరేషన్‌కు రూ.2 లక్షల జరిమానా


విధించారు. వేర్వేరు సెక్షన్ల కింద వేర్వేరుగా ఏడేళ్లు శిక్షలు పడినప్పటికీ ఏకకాలంలో అనుభవించాలని న్యాయమూర్తి తీర్పులో పేర్కొన్నారు. ఇప్పటికే జైలులో అనుభవించిన శిక్షను మినహాయింపునిచ్చారు.


(Andhra Pradesh News)