
Southwest monsoon: తెలుగు రాష్ట్రాలను తాకిన నైరుతి రుతుపవనాలు
Play all audios:

నైరుతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. హైదరాబాద్: నైరుతి రుతు పవనాలు ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని కొన్ని
ప్రాంతాల్లోకి ప్రవేశించినట్లు భారత వాతావరణ శాఖ వెల్లడించింది. రాబోయే మూడు రోజుల్లో మిగిలిన ప్రాంతాలకు విస్తరించేందుకు అనుకూల పరిస్థితులు ఉన్నట్లు ఐఎండీ తెలిపింది. ఉత్తర తెలంగాణపై ద్రోణి
కొనసాగుతున్న నేపథ్యంలో తెలంగాణలో సోమవారం నుంచి గురువారం వరకు భారీ వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని వాతావరణ శాఖ తెలిపింది. ఉమ్మడి ఆదిలాబాద్, నిజామాబాద్, వరంగల్, ఖమ్మం జిల్లాల్లో పలుచోట్ల భారీ
వర్షాలు కురుస్తాయని, ఇతర జిల్లాల్లో తేలికపాటి వర్షాలు కురిసే అవకాశాలు ఉన్నాయని పేర్కొంది.