Vijayawada: విజయవాడలో థీమ్‌ యోగా కార్యక్రమాలు.. వేలాదిగా తరలివచ్చిన ఔత్సాహికులు

Vijayawada: విజయవాడలో థీమ్‌ యోగా కార్యక్రమాలు.. వేలాదిగా తరలివచ్చిన ఔత్సాహికులు

Play all audios:


నగరంలోని బీఆర్‌టీఎస్‌ రోడ్డులో రాష్ట్రస్థాయి థీమ్‌ యోగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వేలాదిగా యోగా ఔత్సాహికులు, విద్యార్థులు హాజరయ్యారు. విజయవాడ: నగరంలోని బీఆర్‌టీఎస్‌


రోడ్డులో రాష్ట్రస్థాయి థీమ్‌ యోగా కార్యక్రమాలు ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి వేలాదిగా యోగా ఔత్సాహికులు, విద్యార్థులు హాజరయ్యారు. 26 జిల్లాల్లో.. 26 రోజులపాటు.. 26 ఇతివృత్తాలతో యోగాంధ్ర


ప్రచార కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ప్రతి వర్గాన్ని యోగాంధ్రలో భాగం చేసే లక్ష్యంతోనే వీటిని నిర్వహిస్తున్నారు. రాష్ట్రంలో కనీసం రెండు కోట్ల మంది యోగాను అనుసరించేలా అవగాహన, శిక్షణ


ఇస్తున్నారు. నిపుణులు రూపొందించిన యోగా కామన్‌ ప్రొటోకాల్‌ ప్రకారం శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 104 పర్యాటక ప్రాంతాల్లోనూ ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టనున్నారు.


జూన్‌ 21న విశాఖలో నిర్వహించే అంతర్జాతీయ యోగా దినోత్సవంలో ప్రధాని మోదీ పాల్గొననున్న విషయం తెలిసిందే. (Vijayawada News)