Uber: ‘అడ్వాన్స్‌ టిప్‌’.. ఉబర్‌కు కేంద్రం నోటీసులు

Uber: ‘అడ్వాన్స్‌ టిప్‌’.. ఉబర్‌కు కేంద్రం నోటీసులు

Play all audios:


ఇంటర్నెట్‌ డెస్క్‌: మహానగరాల్లో సమయం ఆదా చేస్తూ ఒక చోట నుంచి మరో చోటుకు వెళ్లాలంటే ముందుగా గుర్తుకు వచ్చేది క్యాబ్‌ సేవలు (Cab Booking). చాలా మంది ఈ సేవలను వినియోగించుకుంటున్నారు. అయితే..


క్యాబ్‌ బుకింగ్‌ సమయంలో త్వరితగతిన సేవలు వినియోగించుకునేందుకు అడ్వాన్స్‌ టిప్‌ పేరిట అదనంగా డబ్బు వసూలు చేస్తున్నారు. దీనిపై యూజర్లు ఆందోళన చెందుతున్నారు.  రైడ్‌ బుకింగ్‌ సమయంలో అడ్వాన్స్‌


టిప్‌ అంటూ రూ.50, రూ.75, రూ.100 చూపుతుంది. టిప్‌ అందిస్తేనే బుకింగ్ త్వరగా అవుతుందని నోట్‌లో తెలియజేస్తోంది. ఇది టిప్‌ ఇచ్చేందుకు యూజర్‌ను బలవంతం చేస్తోంది. ఒక్కసారి టిప్‌ ఇస్తే దాన్ని


వెనక్కి తీసుకునే అవకాశం లేకుండా పోతోంది. క్యాబ్‌ అగ్రిగేటర్‌ సంస్థ ఉబర్‌ (Uber) సేవల్లో అడ్వాన్స్‌ టిప్‌ వసూలు అంశం ది కన్జూమర్‌ ప్రొటెక్షన్‌ అథారిటీ (సీసీపీఏ) దృష్టికి వెళ్లింది. దీంతో


ఉబర్‌పై సీసీపీఏ చర్యలకు ఉపక్రమించింది.  * గూగుల్ మీట్‌లో రియల్‌ టైమ్‌ ట్రాన్స్‌లేట్ ఫీచర్‌.. ఎలా పని చేస్తుందంటే? ఆ సంస్థకు నోటీసులు జారీ చేసింది. ఈ విషయాన్ని కేంద్రమంత్రి ప్రహ్లాద్‌ జోషి


వెల్లడించారు. ‘‘అడ్వాన్స్‌ టిప్‌ వసూలు చేయడం అనైతికం. వినియోగదారుల నుంచి బలవంతంగా డబ్బు వసూలు చేస్తున్నారు. ఇది దోపిడీ చేయడమే. దీనిపై దృష్టి సారించి ఈ అంశాన్ని పరిశీలించాలని సీసీపీఏను


కోరాను. అడ్వాన్స్‌ వసూళ్లపై వివరణ కోరుతూ ఉబర్‌కు నోటీసులు ఇచ్చింది. వినియోగదారుల పట్ల న్యాయంగా వ్యవహరించాలి. సంస్థలు వారితో పారదర్శకంగా, జవాబుదారీతనంతో ఉండాలి’’ అని ‘ఎక్స్‌’ వేదికగా


పేర్కొన్నారు. మరోవైపు, ఉబర్‌తో పాటు ఓలా (Ola) ఇతర క్యాబ్‌ బుకింగ్‌ సేవల్లో ఇదే పరిస్థితి నెలకొంది.