
Paytm q4 results: పేటీఎం నష్టం రూ. 545 కోట్లు.. ఆదాయంలోనూ క్షీణత
Play all audios:

Paytm Q4 Results | ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ ఫిన్టెక్ సంస్థ పేటీఎం (వన్97 కమ్యూనికేషన్స్) త్రైమాసిక ఫలితాలను (Paytm Q4 Results) ప్రకటించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మార్చితో ముగిసిన
త్రైమాసికంలో కంపెనీ రూ.545 కోట్ల నష్టాన్ని నమోదు చేసింది. గతేడాది ఇదే త్రైమాసికంలో ఈ మొత్తం రూ.551 కోట్లుగా ఉన్నట్లు కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్లో తెలిపింది. నష్టం స్వల్పంగా తగ్గింది.
అంతకుముందు త్రైమాసికంలో రూ.208 కోట్ల నష్టంతో పోలిస్తే నష్టాలు భారీగా పెరిగాయి. కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం కూడా 15.7 శాతం క్షీణించి రూ.1911.5 కోట్లుగా నమోదైంది. 2023 జనవరి- మార్చి
త్రైమాసికంలో ఈ మొత్తం రూ.2267.1 కోట్లుగా ఉంది. * 2 లక్షల పుస్తకాలు ₹7 కోట్లు.. వివాదంలో యూనియన్ బ్యాంక్! వార్షిక ప్రాతిపదికన చూసినప్పుడు 2023-24 ఆర్థిక సంవత్సరంలో రూ.1390.4 కోట్లుగా ఉన్న
నష్టం 2024-25 నాటికి దాదాపు సగానికి అంటే రూ.645.2 కోట్లకు తగ్గింది. ఇదే ఆర్థిక సంవత్సరంలో రెండో త్రైమాసికంలో జొమాటోకు తన ఎంటర్టైన్మెంట్ టికెటింగ్ వ్యాపారాన్ని విక్రయించడం ద్వారా రూ.1,345
కోట్ల లాభాన్ని నమోదు చేసింది. లేదంటే నష్టం మరింత ఎక్కువగా ఉండేది. పేటీఎం వార్షికాదాయం సైతం రూ.9,977.8 కోట్ల నుంచి రూ.6,900 కోట్లకు తగ్గుముఖం పట్టింది. ఫలితాల వేళ మంగళవారం మార్కెట్ ముగిసే
సమయానికి ఎన్ఎస్ఈలో పేటీఎం షేరు విలువ 5.72 శాతం మేర క్షీణించి రూ.816.50 వద్ద ముగిసింది.