Fresher hiring: టెక్‌ కంపెనీల్లో 50% తగ్గిన ఫ్రెషర్ల నియామకాలు

Fresher hiring: టెక్‌ కంపెనీల్లో 50% తగ్గిన ఫ్రెషర్ల నియామకాలు

Play all audios:


Fresher hiring | ఇంటర్నెట్‌ డెస్క్‌: కృత్రిమ మేధ (AI) సాంకేతికత ప్రతి రంగంలోనూ విప్లవాత్మక మార్పులు తీసుకొస్తోంది. దీని రాకతో ఉద్యోగాలపై తీవ్ర ప్రభావం పడుతోంది. మరీ ముఖ్యంగా టెక్‌ కంపెనీల్లో


ఏఐ సాంకేతికత వినియోగం విస్తృతంగా పెరగడంతో ఫ్రెషర్‌ నియామకాలు తగ్గాయి. గత కొన్ని సంవత్సరాల్లో టాప్‌ టెక్‌ కంపెనీల్లో ఈ ట్రెండ్‌ కనిపిస్తోందని తాజాగా ఓ నివేదికలో వెల్లడైంది.  వెంచర్‌


క్యాపిటల్‌ సంస్థ సిగ్నల్‌ఫైర్‌ డేటా ప్రకారం.. టాప్‌ టెక్‌ కంపెనీల్లో ఎంట్రీ-లెవల్‌ నియామకాలు 15 శాతం ఉండగా.. ఇప్పుడు 7 శాతానికి పడిపోయింది. గతంతో పోలిస్తే ఏకంగా 50 శాతం క్షీణించింది. ఇది


తాత్కాలికం కాదని.. టెక్‌ కంపెనీలు పనితీరును ఏఐ ఎలా మారుస్తుందో తెలియజెప్పేందుకు స్పష్టమైన సంకేతమని నిపుణులు భావిస్తున్నారు. కృత్రిమ మేధ సామర్థ్యం పెరగడంతో, ఫ్రెషర్లకు జూనియర్‌ స్థాయి


ఉద్యోగాలు కనుమరుగవుతున్నాయని అభిప్రాయపడుతున్నారు. ఏఐ కారణంగా ఇప్పటికే పలు సంస్థలు సిబ్బందిని తొలగిస్తున్నాయి. తాజాగా ఐబీఎం ఎనిమిది వేల మందిని తొలగించింది. ముఖ్యంగా హెచ్‌ఆర్‌ విభాగంలో ఈ కోతలు


జరిగినట్లు తెలుస్తోంది. ఆ విభాగం పనుల్ని నిర్వహించేందుకు కంపెనీలు ఏఐని ఉపయోగించడమే ఇందుక్కారణమని పలు నివేదికలు తెలుపుతున్నాయి. కొత్త టెక్‌ ఉద్యోగాల్లో ఈ స్కిల్స్‌ ఉన్న వారికే కంపెనీల


ప్రాధాన్యత ఇస్తున్నాయని ది వాల్‌ స్ట్రీట్ జర్నల్‌ సర్వే తెలిపింది. దాదాపు 87 శాతం మంది రిక్రూటర్లు కృత్రిమ మేధలో అనుభవం ఉన్న అభ్యర్థుల కోసం ఎదురుచూస్తున్నారని తెలుస్తోంది. ప్రతి నాలుగు


ఉద్యోగాల్లో ఒకటి ఈ నైపుణ్యంపై ఆధారపడుతోందని పేర్కొంది. టెక్‌ దిగ్గజాలూ అదే బాట.. ఎంట్రీ-లెవల్‌ ఉగ్యోగాల కోసం మాత్రమే కాదు.. మిడ్‌- లెవల్‌ సాఫ్ట్‌వేర్ ఇంజినీర్‌ స్థాయిలో ఏఐ విధులు


నిర్వహిస్తోందని పలు టెక్‌ దిగ్గజాలు అభిప్రాయపడ్డారు. రానున్న 12-18 నెలల్లో తమ కంపెనీకి చెందిన లామా ప్రాజెక్ట్‌కు సంబంధించి చాలావరకు కోడింగ్‌ను ఇదే పూర్తిచేస్తుందని మెటా సీఈఓ మార్క్‌


జుకర్‌బర్గ్‌ అభిప్రాయపడ్డారు. గూగుల్‌ తన సాఫ్ట్‌వేర్‌ కోడ్‌ను రూపొందించడానికి కృత్రిమ మేధ (AI)పై ఎక్కువగా ఆధారపడుతోందని కంపెనీ సీఈఓ సుందర్‌ పిచాయ్‌ ఇప్పటికే వెల్లడించారు. ఇటీవలె మెటా లామా ఏఐ


డెవలపర్‌ కార్యక్రమంలో పాల్గొన్న మైక్రోసాఫ్ట్‌ సీఈఓ సత్యనాదెళ్ల తమ కంపెనీకి సంబంధించి 20 నుంచి 30 శాతం కోడ్‌ను కృత్రిమ మేధతోనే సృష్టిస్తున్నట్లు పేర్కొన్న విషయం తెలిసిందే.