
Couple missing: హనీమూన్కు వెళ్లిన జంట అదృశ్యం
Play all audios:

ఇంటర్నెట్ డెస్క్: హనీమూన్కు వెళ్లిన ఓ జంట అదృశ్యమైన (Couple Missing) ఘటన మేఘాలయలో చోటుచేసుకుంది. వారం గడిచినా ఇంకా వారి ఆచూకీ తెలియకపోవడంతో కుటుంబ సభ్యుల్లో ఆందోళన నెలకొంది. ఆ రాష్ట్ర
ప్రభుత్వం కూడా సీరియస్గా తీసుకుంది. పోలీసులు, వివిధ శాఖల అధికారులతో పాటు స్థానికులు కూడా గాలింపు ముమ్మరం చేసినట్లు ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా వెల్లడించారు. ఈ కేసును ప్రత్యేకంగా
పర్యవేక్షిస్తున్నట్లు చెప్పారు. మధ్యప్రదేశ్లోని ఇందౌర్కు చెందిన ట్రాన్స్పోర్టు వ్యాపారి రాజా రఘవంశీ-సోనమ్లు నూతన దంపతులు. హనీమూన్ కోసం మే 20న మేఘాలయకు వెళ్లారు. చివరిసారిగా సోహ్రా
(చిరపుంజి)లో పర్యటించిన వాళ్లు.. ఆ తర్వాత కనిపించకుండా పోయారు. అయితే, బైక్ను అద్దెకు తీసుకొని కొండప్రాంతం వైపు వెళ్లారు. ఓ ప్రాంతంలో బైక్ను వదిలేసి కాలినడకన వెళ్లినట్లు భావిస్తున్నారు. ఈ
కేసును తీవ్రంగా పరిగణించిన మేఘాలయ ప్రభుత్వం ముమ్మర గాలింపు చేపట్టింది. మరోవైపు వారి కుటుంబ సభ్యులు కూడా దంపతుల ఆచూకీ చెప్పిన వారికి రూ.5లక్షల రివార్డును ప్రకటించింది. * పన్నులుండవ్, లగ్జరీ
లైఫ్.. సంపన్నుల స్వర్గధామం ‘మొనాకో’ ‘‘మధ్యప్రదేశ్ నుంచి నూతన దంపతులకు సంబంధించి దురదృష్టకర సంఘటన చోటుచేసుకుంది. వాళ్లు అదృశ్యమైనట్లు మాకు నివేదికలు వచ్చాయి. మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి మోహన్
యాదవ్ కూడా నాతో మాట్లాడారు. అక్కడి హోంశాఖ నుంచి కూడా కాల్స్ వచ్చాయి. దీనిపై రోజు వ్యక్తిగతంగా పర్యవేక్షిస్తున్నా. ఆ జంట ఆచూకీ కోసం కేవలం పోలీసులు, అధికారులే కాకుండా స్థానిక ప్రజలు కూడా
ముమ్మురంగా గాలిస్తున్నారు’’ అని ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా ఓ వీడియో సందేశంలో పేర్కొన్నారు. వర్షాలు పడుతుండటంతో సెర్చ్ ఆపరేషన్కు సవాళ్లు ఎదురవుతున్నాయని సీఎం పేర్కొన్నారు. అందుబాటులో ఉన్న
సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగిస్తున్నామని చెప్పారు. చిరపుంజిలో భారీ వర్షాలు పడుతుండడంతో గాలింపు ఇబ్బందికరంగా మారిందన్నారు.