
Ipl 2025: ‘ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే.. ’: రవిచంద్రన్ అశ్విన్ ఆసక్తికర వ్యాఖ్యలు
Play all audios:

రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు తొలిసారిగా ఐపీఎల్ టైటిల్ కైవసం చేసుకోవాలంటే.. ముంబయి ఇండియన్స్ ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్కు చేరుకోవద్దని టీమ్ ఇండియా మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్
అభిప్రాయపడ్డాడు. ఇంటర్నెట్ డెస్క్: ఐపీఎల్ (IPL) 2025 దాదాపు ముగింపు దశకు చేరుకుంది. గురువారం ఏకపక్షంగా సాగిన క్వాలిఫయర్ 1లో పంజాబ్ కింగ్స్పై (Punjab Kings) ఆర్సీబీ అలవోకగా గెలిచింది. ఈ
విజయంతో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (Royal Challengers Bengaluru) ఫైనల్కు చేరుకున్న మొదటి జట్టుగా నిలిచింది. పంజాబ్కింగ్స్, గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ ఈ మూడు జట్లలో ఏది తుది
పోరులో బెంగళూరుతో పోటీపడుతుందో తేలాల్సి ఉంది. మరి కొన్ని గంటల్లో.. గుజరాత్ (Gujarat Titans), ముంబయి (Mumbai Indians) మధ్య ఎలిమినేటర్ పోరు జరగనుంది. ఇందులో ఓడిన జట్టు ఐపీఎల్ నుంచి
నిష్క్రమిస్తుంది. గెలిచిన వారు క్వాలిఫయర్-1లో ఆర్సీబీ చేతిలో ఓడిపోయిన పంజాబ్ కింగ్స్తో జూన్ 1న తలపడతారు. క్వాలిఫయర్-2లో గెలిచిన జట్టే బెంగళూరుతో జూన్ 3న ఫైనల్స్ ఆడాల్సి ఉంటుంది.
అయితే, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే ముంబయి ఎట్టి పరిస్థితుల్లోనూ ఫైనల్స్కు చేరుకోవద్దని టీమ్ఇండియా(Team India) మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్
అభిప్రాయపడ్డాడు. ముంబయి ఇండియన్స్ ఫైనల్కు చేరుకుంటే మాత్రం తొలిసారి టైటిల్ గెలవాలనే ఆర్సీబీ ఆశల్ని గల్లంతు చేసి.. ఆరోసారి ట్రోఫీ విన్నర్గా నిలుస్తుందని పేర్కొన్నాడు. ‘ఒకవేళ రాయల్
ఛాలెంజర్స్ బెంగళూరు ఐపీఎల్ టైటిల్ గెలవాలంటే.. గుజరాత్ టైటాన్స్.. ముంబయి ఇండియన్స్పై విజయం సాధించాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ ముంబయి ఫైనల్లో అడుగు పెట్టకుండా ఉంటేనే.. ఆర్సీబీ విజయం
ఖాయమయ్యే అవకాశం ఉంటుంది. బెంగళూరు జట్టు బలంగా కనిపిస్తున్నప్పటికీ.. క్రికెట్లో ఏదైనా జరగొచ్చు. నేనే ఆర్సీబీ జట్టు ఆటగాడినైతే.. గుజరాత్ టైటాన్స్తో ఫైనల్ ఆడాలని కోరుకుంటాను’ అని అశ్విన్
తన యూట్యూట్ ఛానల్లో చెప్పుకొచ్చాడు. అలాగే విరాట్ కోహ్లీ (Virat Kohli) గురించి కూడా అశ్విన్ మాట్లాడాడు. ‘చూస్తుంటే ఇది ఆర్సీబీ సంవత్సరంలా కనిపిస్తోంది. గొప్ప భారత టెస్టు కెప్టెన్లలో ఒకరైన
విరాట్ కోహ్లీ బెంగళూరు విజయాల్లో కీలకపాత్ర పోషిస్తున్నాడు. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుకు ఒకవేళ ఫైనల్లో ఛేజింగ్ చేసే అవకాశం వస్తే.. ఆ పరిస్థితులను తమకు అనుకూలంగా ఎలా మార్చుకోవాలో విరాట్
కోహ్లీకి బాగా తెలుసు’ అని రవిచంద్రన్ అశ్విన్ తనదైన విశ్లేషణ చేశాడు.