Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. 24,850 దిగువకు నిఫ్టీ

Stock market: భారీ నష్టాల్లో సూచీలు.. 24,850 దిగువకు నిఫ్టీ

Play all audios:


Stock market | ముంబయి: దేశీయ స్టాక్‌ మార్కెట్‌ సూచీలు భారీ నష్టాల్లో ముగిశాయి. అంతర్జాతీయ మార్కెట్ల నుంచి మిశ్రమ సంకేతాల నేపథ్యంలో మన సూచీలు తీవ్ర ఒడుదొడుకులు ఎదుర్కొన్నాయి. ఇంట్రాడేలో


సెన్సెక్స్‌ 1300 పాయింట్ల మేర లాభనష్టాల మధ్య చలించింది. ముఖ్యంగా ఆటో, ఐటీ, ఎఫ్‌ఎంసీజీ స్టాక్స్‌ అమ్మకాల ఒత్తిడిని ఎదుర్కొన్నాయి. దీంతో సూచీల రెండు రోజుల వరుస లాభాలకు బ్రేక్‌ పడింది. నిఫ్టీ


మళ్లీ 24,850 స్థాయికి చేరింది. సెన్సెక్స్‌ ఉదయం 82,038.20 పాయింట్ల వద్ద (క్రితం ముగింపు 82,176.45) స్వల్ప నష్టాల్లో ప్రారంభమైంది. కాసేపటికే భారీ నష్టాల్లోకి జారుకుంది. కొద్దిసేపటికి


లాభాల్లోకి వచ్చిన సూచీ 82,410.52 వద్ద గరిష్ఠాన్ని తాకింది. మదుపర్లు ఆనందపడే లోపే మళ్లీ నష్టాల్లోకి వెళ్లిన సూచీ.. ఇంట్రాడేలో 81,121 వద్ద కనిష్ఠాన్ని తాకింది. చివరికి 624 పాయింట్ల నష్టంతో


81,551.63 వద్ద స్థిరపడింది. నిఫ్టీ 174.95 పాయింట్ల నష్టంతో 24,826.20 వద్ద ముగిసింది. డాలరుతో రూపాయి మారకం విలువ 27 పైసలు క్షీణించి 85.37గా ఉంది. సెన్సెక్స్‌ 30 సూచీలో ఇండస్‌ ఇండ్‌ బ్యాంక్‌,


సన్‌ఫార్మా, అదానీ పోర్ట్స్‌, నెస్లే ఇండియా, ఏషియన్‌ పెయింట్స్‌ షేర్లు మాత్రమే లాభపడ్డాయి. అల్ట్రాటెక్‌ సిమెంట్‌, ఐటీసీ, టాటా మోటార్స్‌, యాక్సిస్‌ బ్యాంక్‌, ఎన్టీపీసీ షేర్లు నష్టాల్లో


ముగిశాయి. అంతర్జాతీయ విపణిలో బ్రెంట్ క్రూడ్‌ బ్యారెల్‌ ధర 64.87 డాలర్ల వద్ద కొనసాగుతుండగా.. బంగారం ఔన్సు 3294 డాలర్ల వద్ద ట్రేడవుతోంది.