
Indo pak conflict: సరిహద్దులో ఉద్రిక్తతలు.. దిల్లీవ్యాప్తంగా సైరన్ల టెస్టింగ్
Play all audios:

భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం, కంట్రోల్ రూమ్లు, అనేక ప్రాంతాల్లో ఎయిర్ సైరన్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్ నిర్వహించడంలో దేశ రాజధాని నిమగ్నమైంది. ఇంటర్నెట్ డెస్క్: భారత్-పాకిస్థాన్ల మధ్య
ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్న వేళ (Operation Sindoor).. ఏదైనా అత్యవసర పరిస్థితులను తలెత్తితే వాటిని ఎదుర్కొనేందుకు ఆయా రాష్ట్రాలు అప్రమత్తమవుతున్నాయి. సరిహద్దు రాష్ట్రాల్లో రాత్రి కరెంటు
కట్, స్కూళ్ల మూత, ఉద్యోగులకు సెలవులు రద్దు వంటి చర్యలు తీసుకుంటున్నారు. ఈ క్రమంలో భారీ సంఖ్యలో బలగాలను మోహరించడం, కంట్రోల్ రూమ్లు, అనేక ప్రాంతాల్లో ఎయిర్ సైరన్ల ఏర్పాటు, మాక్ డ్రిల్స్
నిర్వహించడంలో దేశ రాజధాని (Delhi) నిమగ్నమైంది. రాజధానిలోని ప్రభుత్వ కార్యాలయాలతో పాటు కీలక స్థావరాల్లో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. రద్దీగా ఉండే మార్కెట్లు, రైల్వే స్టేషన్లు, మాల్స్,
పార్కులు, మెట్రో స్టేషన్లలో నిఘాను పెంచారు. ఎటువంటి పరిస్థితులనైనా సమర్థంగా ఎదుర్కొనేందుకు వీలుగా 11 జిల్లాలను సంసిద్ధం చేస్తున్నారు. వీటితోపాటు నగర వ్యాప్తంగా ప్రజలను అప్రమత్తం చేసేందుకు
వీలుగా సైరన్లను (Air Sirens) ఏర్పాటు చేసే పనిలో పడ్డారు. * పాక్ మిలిటరీ పోస్ట్ ధ్వంసం.. వీడియో షేర్ చేసిన ఇండియన్ ఆర్మీ ‘‘సైరన్లను అమర్చుతున్నాం. ఎత్తైన భవనాలపై ఏర్పాటు చేసి, వీటి
పనితీరును పరిశీలిస్తున్నాం. రానున్న రోజుల్లో మరిన్ని ప్రదేశాల్లో ఏర్పాటు చేయనున్నాం. 11 జిల్లాల పరిధిలో ఇప్పటివరకు 10 సైరన్లు ఏర్పాటు చేశాం. కొన్ని సైరన్ శబ్దాలు రెండు కి.మీలు, కొన్ని
నాలుగు, మరికొన్ని 16 కి.మీ పరిధి వరకు వినిపిస్తాయి’’ అని దిల్లీ రెవెన్యూ అధికారులు వెల్లడించారు. వీటికి సంబంధించి జిల్లా కలెక్టర్ కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని, ఇవి శబ్దం
చేసినప్పుడు ఎలా స్పందించాలనే విషయంపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నామని చెప్పారు. పేలుడు పదార్థం నిర్వీర్యం.. భారత్లోని సరిహద్దు జిల్లాలపై పాకిస్థాన్ డ్రోన్, క్షిపణి దాడులకు పాల్పడిన సంగతి
తెలిసిందే. ఈ క్రమంలో అమృత్సర్లోని ఓ గ్రామంలో పంటపొలాల్లో గురువారం పేలని పదార్థాలను అధికారులు గుర్తించారు. అనంతరం సైన్యానికి సమాచారం అందించారు. వాటిని సేకరించిన భారత సైన్యం.. విజయవంతంగా
నిర్వీర్యం చేసింది.