
Viral video: ఈ వీడియో చూస్తే గుండె తరుక్కుపోవాల్సిందే.. స్పందించిన కేంద్ర మంత్రి
Play all audios:

చేతికొచ్చిన పంట వర్షంలో కొట్టుకుపోతుంటే ఓ రైతు భారీ వర్షాన్ని లెక్కచేయక పంటను కాపాడుకునేందుకు ఎంతో ప్రయత్నించాడు. ఈ వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దిల్లీ: ఆరుగాలం
కష్టించి పండించిన రైతుకే పంట విలువ తెలుసు. అకాల వర్షాలతో పంట నీటిలో తడవడం, కొట్టుకెళ్లడం, మొలకలు రావడం మనం తరుచూ చూస్తూనే ఉంటాం. చేతికొచ్చిన పంట నేలపాలైతే ఆ రైతు బాధ వర్ణనాతీతం. మహారాష్ట్రలో
వర్షం నీటిలో కొట్టుకుపోతున్న పంటను కాపాడేందుకు ఓ రైతు పడిన కష్టం ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. దీనిపై కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ (Shivraj Singh
Chouhan) స్పందించారు. బాధితుడితో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. మహారాష్ట్ర (Maharashtra)కు చెందిన రైతు గౌరవ్ పన్వార్ తన వేరుశనగ పంటను అమ్ముకోవడానికి వాషిమ్ మార్కెట్కు తీసుకొచ్చాడు.
అయితే భారీ వర్షం కురవడంతో పంట నీటిలో కొట్టుకొనిపోయింది. దీంతో రైతు గౌరవ్ భారీ వర్షంలో తడుస్తూనే కొట్టుకుపోతున్న వేరుశనగను కాపాడేందుకు శాయశక్తులా ప్రయత్నించాడు. ఈ హృదయవిదారక వీడియో చేస్తే
ఎవరి గుండె అయినా తరుక్కుపోవాల్సిందే. ప్రస్తుతం ఈ వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారింది. ఈ విషయం కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ దృష్టికి రావడంతో.. స్వయంగా ఆయనే బాధిత
రైతుకు ఫోన్ చేసి మాట్లాడారు. అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. దీనికి సంబంధించి శివరాజ్ సింగ్ చౌహాన్ ఎక్స్లో పోస్టు చేశారు. ‘‘ఈ విషయం నన్ను చాలా బాధించింది. అయితే చింతించవద్దు. మహారాష్ట్ర
ప్రభుత్వం రైతుల సమస్యలపై చాలా సున్నితంగా వ్యవహరిస్తోంది. దీనిపై సీఎం దేవేంద్ర ఫడణవీస్, రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి, జిల్లా కలెక్టర్తో మాట్లాడాను. నష్టపోయిన పంటకు పరిహారం చెల్లిస్తాం. మీరు,
మీ కుటుంబ సభ్యులు ఇబ్బందులు పడకుండా చూస్తాం’’ అని కేంద్ర మంత్రి బాధిత రైతుకు భరోసా కల్పించారు.