Operation sindoor: కాల్పుల విరమణ కొనసాగింపునకు భారత్‌-పాక్‌ అంగీకారం

Operation sindoor: కాల్పుల విరమణ కొనసాగింపునకు భారత్‌-పాక్‌ అంగీకారం

Play all audios:


డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు భారత్‌, పాక్‌లు మొగ్గు చూపినట్లు సమాచారం. ఇంటర్నెట్‌ డెస్క్‌: భారత్‌-పాక్‌ల మధ్య


నెలకొన్న ఉద్రిక్తతలను తగ్గించే ప్రయత్నాలను కొనసాగించాలని ఇరుదేశాల సైనికాధికారులు నిర్ణయించినట్లు సమాచారం. వీటికి సంబంధించి మే 10న ఇరు దేశాల డైరెక్టర్‌ జనరల్‌ ఆఫ్‌ మిలిటరీ ఆపరేషన్స్‌ (DGMOs)


స్థాయిలో చేసుకున్న తాత్కాలిక కాల్పుల విరమణ అవగాహనను కొనసాగించేందుకు మొగ్గు చూపినట్లు సంబంధిత వర్గాలు వెల్లడించాయి. విశ్వాసాన్ని పెంపొందించే చర్యల్లో భాగంగానే వీటిని కొనసాగించాలని భారత్‌,


పాక్‌ సైనికాధికారులు ఇందుకు అంగీకరించినట్లు తెలిసింది. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్‌ చేపట్టిన ప్రతీకార దాడులతో పాకిస్థాన్‌ ఉక్కిరిబిక్కిరయ్యింది. ప్రతిదాడులు చేసేందుకు దాయాది దేశం


యత్నించినప్పటికీ.. భారత బలగాల దెబ్బకు తోకముడిచింది. చివరకు ఉద్రిక్తతలు తగ్గించాలని పాక్‌ (Pakistan) కోరడంతో అందుకు భారత్‌ అంగీకరించగా.. మే 10న కాల్పుల విరమణ అమల్లోకి వచ్చింది. ఈ వ్యవహారంలో


సైన్యంలోని డీజీఎంవో స్థాయి అధికారులు కీలకంగా వ్యవహరించారు. పరిస్థితులు తీవ్ర రూపం దాల్చుతున్న వేళ వీరి మధ్య పరస్పర అవగాహనతో ఉద్రిక్తతలకు తాత్కాలికంగా తెరపడింది.