Eknath shinde: ఉగ్రవాదంపై రాజీ లేదు.. పాక్‌ని తుడిచిపెట్టేసే సత్తా మనకు ఉంది: శిందే

Eknath shinde: ఉగ్రవాదంపై రాజీ లేదు.. పాక్‌ని తుడిచిపెట్టేసే సత్తా మనకు ఉంది: శిందే

Play all audios:


ఉగ్రవాదాన్ని భారత్‌ ఎట్టి పరిస్థితుల్లో సహించదని.. ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను తుడిచిపెట్టేసే సత్తా మన దేశానికి ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde) అన్నారు.


ముంబయి: ఉగ్రవాదాన్ని భారత్‌ ఎట్టి పరిస్థితుల్లో సహించదని.. ప్రపంచ పటం నుంచి పాకిస్థాన్‌ను తుడిచిపెట్టేసే సత్తా మన దేశానికి ఉందని మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్‌నాథ్‌ శిందే(Eknath Shinde)


అన్నారు. ఆదివారం ఆయన ముంబయిలో మీడియాతో మాట్లాడారు. నాలుగు రోజుల పాటు డ్రోన్, క్షిపణి దాడులతో సరిహద్దు ప్రాంతం దద్దరిల్లిన నేపథ్యంలో శనివారం భారత్‌ -పాక్‌ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన


మరుసటి రోజు శిందే ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం.  ఉగ్రవాదంపై ఎట్టిపరిస్థితుల్లో రాజీ ఉండదని, దీన్ని సహించేది లేదంటూ ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌కు గట్టి సందేశాన్నిచ్చారన్నారు. బాహ్య


ముప్పును ఎదుర్కొనేందుకు భారత్‌ సామర్థ్యాన్ని కలిగి ఉందని తెలిపారు. ఈ ప్రపంచ పటం నుంచి పాక్‌ను తుడిచిపెట్టే సామర్థ్యం భారత్‌కు ఉందన్న శిందే.. మన దేశ దృఢమైన వైఖరిని చూసి పాకిస్థాన్‌


నేర్చుకోవాలన్నారు. తన సొంత పరిమితులేంటో తెలుసుకొని భారత్‌తో సంబంధాలు పెట్టుకోవాలన్నారు. భారత్‌-పాక్‌ మధ్య శనివారం కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో కాల్పుల విరమణ,


తదనంతర పరిస్థితిపై ఇరు దేశాల మధ్య సోమవారం మధ్యాహ్నం 12 గంటలకు కీలక చర్చలు జరగనున్నాయి. హాట్‌లైన్‌లో జరగనున్న ఈ చర్చల్లో రెండు దేశాల డైరెక్టర్ జనరల్ మిలటరీ ఆపరేషన్స్(DGMO)లు పాల్గొననున్నారు.